News July 31, 2024

ransomware: 300 బ్యాంకుల సేవలు ఆగిపోయాయ్!

image

ఇండియాలోని 300 చిన్న బ్యాంకులకు టెక్నాలజీ సపోర్ట్ అందిస్తోన్న C-Edge Technologiesపై ‘ransomware’ (మాల్‌వేర్) అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఆయా బ్యాంకుల RTGS, యూపీఐ, ఏటీఎం సర్వీసులు నిలిచిపోయాయి. ఇందులో ఎక్కువ సంఖ్యలో RRBలు, కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. అయితే దీనిపై C-Edge Technologies ఇంకా స్పందించలేదు. ransomware వల్ల పెద్ద బ్యాంకులపై ఎలాంటి ప్రభావం పడలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Similar News

News January 18, 2026

తెలంగాణ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

image

* మెట్రో ఫేజ్ 2ఏ, ఫేజ్ 2బీ భూసేకరణకు సంబంధించి రూ.2,787 కోట్ల కేటాయింపునకు ఆమోద ముద్ర
* ములుగు జిల్లాలో సాగునీరు అందించేందుకు పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం
* 2027లో జులై 27- ఆగస్టు 3 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు బాసర-భద్రాచలం వరకు ఉన్న పురాతన ఆలయాల శాశ్వత అభివృద్ధి, ఎకో పార్కుల నిర్మాణానికి నిర్ణయం
* మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి నిర్ణయం

News January 18, 2026

30ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు చేయించుకుంటే బెటర్

image

30ఏళ్లు దాటిన వాళ్లు అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఏడాదికోసారి BP, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ ఫంక్షన్, కంటి పరీక్షలు, థైరాయిడ్ టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. 30-65ఏళ్ల మహిళలు ప్రతి 3సంవత్సరాలకు పాప్ స్మియర్/5ఏళ్లకు HPV టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు.

News January 18, 2026

‘శాంతి బోర్డు’లోకి ఇండియాను ఆహ్వానించిన ట్రంప్!

image

గాజా శాంతి బోర్డులో చేరాలంటూ ఇండియాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఈ నెల 15న ఏర్పాటు చేశారు. దీనికి ట్రంప్ ఛైర్మన్‌గా ఉంటారని వైట్ హౌస్ ప్రకటించింది. 11 మంది సభ్యులతో ప్రత్యేకంగా గాజా కార్యనిర్వాహక బోర్డు ఉంటుందని తెలిపింది. మరోవైపు తమకూ ట్రంప్ నుంచి పీస్ బోర్డులోకి ఆహ్వానం అందిందని పాకిస్థాన్‌ వెల్లడించింది.