News August 11, 2025
అరుదైన వ్యాధి: ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే!

రాజస్థాన్లో మోడ్రన్ కుంభకర్ణుడిగా పేరుగాంచిన పుర్ఖారామ్ అనే 46 ఏళ్ల వ్యక్తి నెలలో 25 రోజులు నిద్రపోయే ఉంటారు. ఆయనకు 23 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. యాక్సిస్ హైపర్సోమ్నియా అనే ఈ నరాల సంబంధిత వ్యాధి వల్ల ఆయన ఏకధాటిగా నిద్రపోతుంటారు. మిగిలిన ఐదు రోజులు మాత్రమే తన వ్యాపారం చేసుకుంటున్నారు. నిద్రలోనే కుటుంబీకులు అతనికి తినిపించడం, స్నానం చేయించడం చేస్తుంటారు.
Similar News
News August 11, 2025
మార్పుల తర్వాత ఇన్కమ్ టాక్స్ బిల్లుకు ఆమోదం

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ LSలో ప్రవేశపెట్టిన ఇన్కమ్ టాక్స్ బిల్లు చర్చ లేకుండానే ఆమోదం పొందింది. FEBలోనే బిల్లును కేంద్రం LSలో ప్రవేశపెట్టింది. 1961 నుంచి ఎన్నో సవరణలకు గురై సంక్లిష్టంగా మారిందని విపక్షాలు అభ్యంతరం చెప్పాయి. దీంతో కేంద్రం సెలక్ట్ కమిటీకి రిఫర్ చేసింది. ఈక్రమంలోనే గత శుక్రవారం దాన్ని వెనక్కి తీసుకొని కమిటీ సూచనలతో మార్పులు చేసింది. ఇది 2026 APR 1 నుంచి అమల్లోకి రానుంది.
News August 11, 2025
నిద్రలో కాళ్లు, చేతులు మొద్దుబారుతున్నాయా?

నిద్రలో కొందరికి చేతులు, కాళ్లు మొద్దుబారిపోతుంటాయి. ఇది ఒక రకమైన ఆరోగ్య సమస్య అని వైద్యులు చెబుతున్నారు. మణికట్టు నరాలపై ఒత్తిడి పెరిగితే వేళ్లు, సయాటిక్ నాడీపై ఒత్తిడి పెరిగితే కాళ్లు, మోచేతి నరాలపై ఒత్తిడి పెరిగితే చేతులు తిమ్మిరి ఎక్కుతాయి. విటమిన్ B12, B6, మెగ్నీషియం లోపం వల్ల నరాలు బలహీనపడి ఒత్తిడికి గురవుతాయి. మెరుగైన రక్త ప్రసరణకు వ్యాయామం చేయాలని, సమతుల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
News August 11, 2025
APలో మైండ్ట్రీ పెట్టుబడులు

AP:అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రముఖ టెక్ సంస్థ LTIMindtree పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ‘దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ టెక్నాలజీ హబ్ను రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు గర్వంగా ఉంది. L&T, IBM, AP GOVTతో కలిసి ప్రపంచస్థాయి క్వాంటమ్ ఎకో సిస్టమ్ను ఆవిష్కరిస్తాం. మా క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డీప్ టెక్ రీసెర్చ్, ఇంక్యుబేషన్, ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తుంది’ అని Xలో వెల్లడించింది.