News February 4, 2025
రథ సప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

రథ సప్తమి రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళంలోని అరసవిల్లిలోని సూర్యభగవానుడిని దర్శించుకునేందుకు ఉదయాన్నే భక్తులు పోటెత్తారు. మరోవైపు తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ ప్రారంభించింది. సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగింపు సాగుతోంది. యాదాద్రిలోనూ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు.
Similar News
News October 29, 2025
ఇక స్పామ్ కాల్స్కు చెక్.. TRAI నిర్ణయం!

ఇన్కమింగ్ కాల్స్ విషయంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. కాలర్ పేరు రిసీవర్ ఫోన్లో ఇకపై డిఫాల్ట్గా డిస్ప్లే కానుంది. ఈ మేరకు టెలికం శాఖ ప్రపోజల్కు TRAI ఆమోదం తెలిపింది. SIM తీసుకునేటప్పుడు ఇచ్చిన వివరాలను ‘కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్’ ఫీచర్ ద్వారా ప్రదర్శిస్తారు. ఇది అందుబాటులోకొస్తే TrueCaller వంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం ఉండదు. స్పామ్ కాల్స్ను అరికట్టడంలో ఇది ఉపయోగపడుతుందని TRAI చెప్పింది.
News October 29, 2025
భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

TG: మొంథా తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేపు పలు జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. అటు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో సెలవు ఇవ్వాలని విద్యార్థులు, పేరెంట్స్ కోరుతున్నారు.
News October 29, 2025
రాహుల్ గూండాలా మాట్లాడుతున్నారు: బీజేపీ

ఓట్ల కోసం <<18140008>>డాన్స్<<>> చేయమన్నా చేస్తారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. లోకల్ గూండాలా రాహుల్ మాట్లాడుతున్నారని మండిపడింది. ‘మోదీకి ఓటు వేసిన దేశంలోని ప్రతి పేద వ్యక్తిని రాహుల్ అవమానించారు. ఓటర్లను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’ అని విమర్శించింది. చొరబాటుదారులకు బహిరంగంగానే ఆయన అండగా నిలుస్తున్నారని ఫైరయింది.


