News February 4, 2025

రథ సప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

image

రథ సప్తమి రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళంలోని అరసవిల్లిలోని సూర్యభగవానుడిని దర్శించుకునేందుకు ఉదయాన్నే భక్తులు పోటెత్తారు. మరోవైపు తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ ప్రారంభించింది. సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగింపు సాగుతోంది. యాదాద్రిలోనూ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు.

Similar News

News February 8, 2025

27 ఏళ్ల తర్వాత BJP జెండా ఎగరేస్తుందా?

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. దేశ రాజధానిపై తన జెండా ఎగిరేయడానికి దాదాపు 3 దశాబ్దాలుగా BJP ఎదురు చూస్తోంది. AK చేసిన యమునాలో విషం, రామాయణం వ్యాఖ్యలను ఆ పార్టీ గట్టిగానే తిప్పికొట్టింది. ఆప్‌ది అవినీతి ప్రభుత్వమనే విమర్శలతోనూ ఇరకాటంలో పెట్టి పోటాపోటీగా తలపడింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు 27ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. దీనిపై మీ కామెంట్.

News February 8, 2025

9 గంటల విచారణలో ఆర్జీవీకి 41 ప్రశ్నలు

image

AP: ఒంగోలు రూరల్ PSలో డైరెక్టర్ RGVని నిన్న 9 గంటల పాటు 41 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వాటిలో 90% ఆయన సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం మళ్లీ విచారణకు రావాలని పోలీసులు చెప్పారు. అలాగే, మరో కేసులో ఆయనకు గుంటూరు CID నోటీసులిచ్చి ఈ నెల 10న విచారణకు రావాలంది. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని బి.వంశీకృ‌ష్ణ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది.

News February 8, 2025

ఉదయం టిఫిన్ మానేస్తున్నారా?

image

బిజీగా ఉండటం వల్లో లేక ఇతరత్రా కారణాలతోనో చాలామంది ఉదయం అల్పాహారం మానేస్తుంటారు. అలా మానడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల నీరసం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడం, రక్తంలో చక్కెర స్థాయుల పెరుగుదల, రోజంతా విపరీతమైన ఆకలి, భావోద్వేగాల ఊగిసలాట, రోగ నిరోధక శక్తి తగ్గుదల వంటి పలు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మరి మీరు తింటున్నారా? కామెంట్ చేయండి.

error: Content is protected !!