News July 12, 2024

రత్న భాండాగారం.. అధికారులకు ‘సర్పాల’ భయం

image

ఒడిశాలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయంలోని రహస్య గదిని తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ గదిని తెరిచే అధికారులను సర్పాల భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా స్నేక్ క్యాచర్స్, డాక్టర్లను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈ నెల 14న రత్న భాండాగారం తెరవనున్నారు. 1978 తర్వాత ఇంతవరకూ ఆ రహస్య గదిని తెరవలేదు. ఐదు చెక్క పెట్టెల్లో వెలకట్టలేని విలువైన ఆభరణాలు ఉన్నట్లు సమాచారం.

Similar News

News November 17, 2025

ఒకే కుటుంబంలో 18 మంది మృతి

image

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్‌లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.

News November 17, 2025

ఒకే కుటుంబంలో 18 మంది మృతి

image

సౌదీలో ఘోర <<18310005>>బస్సు<<>> ప్రమాదం HYDలో పెను విషాదాన్ని నింపింది. మృతులంతా HYD వాసులే కాగా రాంనగర్‌లోని నసీరుద్దీన్ ఫ్యామిలీకి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్ మాత్రం ఉద్యోగరీత్యా USలో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో అతనొక్కడే మిగిలాడని వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు.

News November 17, 2025

క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈనెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.