News October 25, 2024

రోహిత్ కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత జట్టు ప్రదర్శన, రోహిత్ కెప్టెన్సీ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ ఫీల్డింగ్ ఏర్పాటు సరిగా చేయలేదని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ ఉండాలని పేర్కొన్నారు. NZ బ్యాటింగ్ చూస్తుంటే రోహిత్ కెప్టెన్సీ వైఫల్యం కనిపిస్తోందన్నారు. వెంటవెంటనే వికెట్లు తీసేలా వ్యూహం రచిస్తే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయని చెప్పారు.

Similar News

News March 18, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,500లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.90,000కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1100 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది. శుభకార్యాల వేళ బంగారం ధరలు సామాన్యుడిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి.

News March 18, 2025

తిరుపతిలో ధర్నా.. బీసీవై పార్టీ చీఫ్‌పై కేసు

image

AP: తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా <<15787478>>సాధువులతో కలిసి ధర్నా<<>> చేసిన బీసీవై(భారత చైతన్య యువజన) పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్‌పై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయనపై కేసు పెట్టారు. ఆయనతో సహా మరో 19 మందిపై FIR నమోదైంది.

News March 18, 2025

ఒంటి పూట బడుల సమయం మార్పు

image

AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా.5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.

error: Content is protected !!