News October 25, 2024
రోహిత్ కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
న్యూజిలాండ్తో రెండో టెస్టులో భారత జట్టు ప్రదర్శన, రోహిత్ కెప్టెన్సీ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ ఫీల్డింగ్ ఏర్పాటు సరిగా చేయలేదని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ ఉండాలని పేర్కొన్నారు. NZ బ్యాటింగ్ చూస్తుంటే రోహిత్ కెప్టెన్సీ వైఫల్యం కనిపిస్తోందన్నారు. వెంటవెంటనే వికెట్లు తీసేలా వ్యూహం రచిస్తే భారత్కు విజయావకాశాలు ఉంటాయని చెప్పారు.
Similar News
News October 26, 2024
నేటి ముఖ్యాంశాలు
* AP: చేయని తప్పుకు శిక్ష.. గుండె తరుక్కుపోయింది: చంద్రబాబు
* షర్మిలతో పాదయాత్ర చేయించవద్దని జగన్కు చెప్పా: పేర్ని నాని
* ఆస్తులకు జగన్ గార్డియన్ మాత్రమే: షర్మిల
* TG: తెలంగాణ బాగు కోసమే బీఆర్ఎస్ పార్టీ: కేటీఆర్
* HYDలో కనీస మౌలిక వసతులు లేవు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
* జైలు నుంచి విడుదలైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
* రెండో టెస్టు: 301 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్
News October 26, 2024
అత్యంత విలువైన సంస్థగా ఎన్విడియా
ప్రపంచంలోనే విలువైన సంస్థగా ఉన్న యాపిల్ను తోసిరాజని NVIDIA ఈరోజు ఆ స్థానాన్ని దక్కించుకుంది. త్వరలో AI సూపర్ కంప్యూటింగ్ చిప్స్ తీసుకురానుందన్న వార్తలతో సంస్థ షేర్ విలువ గణనీయంగా పెరిగింది. ఎన్విడియా విలువ 3.53 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, యాపిల్ విలువ 3.52 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. 6.6 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఓపెన్ఏఐ ప్రకటించిన అనంతరం NVIDIA విలువ ఈ నెలలో 18శాతం పెరిగింది.
News October 26, 2024
ఇంకా యవ్వనంలోనే ఉన్నారా అన్నట్లుగా..!
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలకు రావాలని మెగాస్టార్ చిరంజీవిని కింగ్ నాగార్జున ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోను చూసి మెగా, అక్కినేని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ ఇంకా యవ్వనంలోనే ఉన్నారా అన్నట్లుగా కనిపిస్తున్నారని కొనియాడుతున్నారు. ఇటీవల విశ్వంభర టీజర్లోనూ మెగాస్టార్ పాత సినిమాల్లోని చిరులా ఉన్నారంటూ మెగాఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.