News March 16, 2024

బీజేపీలో చేరిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు

image

రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి శనివారం విజయవాడలో బీజేపీలో చేరారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు రామచంద్రారెడ్డితో పాటు ఆయన సతీమణి కాపు భారతి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Similar News

News January 25, 2026

అనంత జిల్లాలో రథసప్తమి ఎఫెక్ట్.. తగ్గిన ధరలు

image

అనంతపురం జిల్లాలో రథసప్తమి సందర్భంగా ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260, అనంతపురంలో రూ.240, స్కిన్ లెస్ రూ.260 కళ్యాణదుర్గంలో రూ.280 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. చికెన్ ధరలు తగ్గడంతో మాంసప్రియులు హర్షం వ్యక్తం చేశారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి.

News January 25, 2026

ATP: ‘గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలి’

image

77వ గణతంత్ర దినోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ సి.విష్ణు చరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం అనంతపురం నగరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి పోలీసు పరేడ్ మైదానంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు.

News January 25, 2026

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్ సమీక్ష

image

గణతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. పోలీసు పెరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. పారిశుద్ధ్యం, ఫ్లాగ్ హోయిస్టింగ్, కవాతు, తాగునీరు, సీటింగ్, స్టాల్స్, శకటాల ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదన్నరు.