News January 30, 2025
బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు

డిజిటల్ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. నష్టాలను తగ్గించుకునేందుకు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై మెరుగైన పర్యవేక్షణ ఉండాలని సూచించింది. అలాగే లిక్విడిటినీ పెంచుకునేందుకు సెంట్రల్ బ్యాంక్ రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది.
Similar News
News February 10, 2025
TODAY HEADLINES

* దక్షిణాది రాష్ట్రాలకు మోదీ ప్రమాదకరం: రేవంత్
* తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు అరెస్ట్
* కులగణన రీసర్వే చేస్తే సహకరిస్తాం: కేటీఆర్
* APలో ట్రాక్టర్ బోల్తా.. నలుగురు కూలీలు దుర్మరణం
* రోహిత్ సెంచరీ.. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్
* మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
* భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోల మృతి
* పైరసీ చేసిన, చూస్తున్న వాళ్లను వదిలిపెట్టం: నిర్మాత బన్నీవాసు
News February 10, 2025
వీరు త్వరగా ముసలోళ్లు కారు?

అన్ని రక్త వర్గాల్లో కంటే B బ్లడ్ గ్రూప్ వారు నెమ్మదిగా వృద్ధాప్యం పొందుతారని ప్లానెట్ టుడే సర్వే తెలిపింది. మిగతా గ్రూపులతో పోల్చుకుంటే ఈ గ్రూప్ వారు నెమ్మదిగా ముసలోళ్లుగా మారతారని పేర్కొంది. వీరి రక్తంలో కణాల పునరుత్పత్తి, కణజాల మరమ్మతులు మెరుగ్గా ఉండటం వల్ల యవ్వనంగా కనిపిస్తారని తెలిపింది. అలాగే వీరికి సుదీర్ఘ ఆయుర్దాయం కూడా ఉంటుందని వెల్లడించింది.
News February 10, 2025
రేపు మహా కుంభమేళాకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరం స్థానిక ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రయాగ్ రాజ్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.