News April 24, 2024
తన చెత్త రికార్డును రిపీట్ చేసిన RCB
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోన్న RCB అభిమానులను నిరాశపరుస్తోంది. IPL-2019లో తొలి 8 మ్యాచ్ల తర్వాత కేవలం 2 పాయింట్లు సాధించగా, ఆ చెత్త రికార్డును ఈ ఏడాదీ రిపీట్ చేసింది. ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మిగిలిన ఆరు మ్యాచ్లను గెలిచినా ప్లేఆఫ్స్లోకి వెళ్లే ఛాన్స్ను కోల్పోయింది. వచ్చే ఏడాదైనా సమతూకంతో ప్లేయర్లను తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Similar News
News October 15, 2024
భారీ వర్షాలు.. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు
AP: రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తిరుపతి-0877-2236007, గూడూరు-8624252807, సూళ్లూరుపేట-8623295345, తిరుపతి RDO-7032157040, శ్రీకాళహస్తి-9966524952 నంబర్లను అందుబాటులో ఉంచారు. అటు పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్నారు.
News October 15, 2024
రతన్ టాటా కుక్క బెంగతో చనిపోయిందా..? నిజమిదే!
స్వర్గీయ రతన్ టాటాపై బెంగతో ఆయన పెంపుడు శునకం ‘గోవా’ చనిపోయిందంటూ వాట్సాప్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వార్తల్ని ముంబైలో ఇన్స్పెక్టర్గా ఉన్న సుధీర్ కుడాల్కర్ ఖండించారు. ‘రతన్కి సన్నిహితుడైన శంతను నాయుడిని అడిగి తెలుసుకున్నాను. గోవా ఆరోగ్యంగా ఉంది. దయచేసి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు. కాగా.. లైకుల కోసం ఇంత దిగజారాలా అంటూ ఆ వీడియో క్రియేటర్లపై పలువురు మండిపడుతున్నారు.
News October 15, 2024
మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలతో మనోభావాలు దెబ్బతినవు: హైకోర్టు
మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన ఇద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఓ మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారన్న ఆరోపణలపై దక్షిణ కన్నడ పోలీసులు గత ఏడాది ఇద్దర్ని అరెస్టు చేశారు. మసీదు బహిరంగ ప్రదేశం కావడం, స్థానికంగా మతసామరస్యంతో ఉంటున్నామని ఫిర్యాదుదారే చెప్పిన నేపథ్యంలో నిందితులు చేసింది క్రిమినల్ నేరం కిందికి రాదని కోర్టు అభిప్రాయపడింది.