News July 4, 2024

IND- PAK- AUSతో ముక్కోణపు సిరీస్‌కు సిద్ధం: క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో

image

భారత్, పాక్ ఆడే మ్యాచ్‌లపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా CEO నిక్ హాక్లీ చెప్పారు. దాయాది దేశాలు, ఆసీస్‌తో కలిపి ముక్కోణపు సిరీస్ నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. తుది నిర్ణయం భారత్, పాక్ బోర్డులపైనే ఆధారపడి ఉంటుందని, ఇప్పటి వరకు తాము చర్చలు జరపలేదని పేర్కొన్నారు. 2012 నుంచి IND-PAK ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడని విషయం తెలిసిందే. ICC ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి.

Similar News

News November 24, 2025

‘Gambhir Go Back’.. నెటిజన్ల ఫైర్

image

గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక టీమ్ ఇండియా ఆటతీరు దిగజారిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్వదేశంలో జరిగే టెస్టుల్లోనూ ఇంత దారుణమైన బ్యాటింగ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయ్యామని, BGT సిరీస్ కోల్పోయామని గుర్తు చేస్తున్నారు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే మార్పులు ఎందుకని మండిపడుతున్నారు. గంభీర్ హెడ్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 24, 2025

అరటి పంట పెరుగుదల, పండు నాణ్యత కోసం

image

అరటి మొక్కకు కొద్దిపాటి రసాయన ఎరువులతో పాటు ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులను వేయడం వల్ల మొక్క ఎదుగుదలతో పాటు పండు నాణ్యత పెరుగుతుంది. 300 గ్రాముల భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 5 కేజీల బాగా చిలికిన పశువుల ఎరువుతో కలిపి మొక్కలకు అందించాలి. 45 సెం.మీ పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీసి అందులో ఈ ఎరువును వెయ్యాలి. భాస్వరం ఎరువులు పంట మొదటి దశలోనే అవసరం. తర్వాతి దశలో అవసరం ఉండదు.

News November 24, 2025

చీకటి తర్వాత రావి చెట్టు వద్దకు వెళ్లకూడదా?

image

చీకటి పడ్డాక రావి చెట్టు వద్దకు వెళ్తే దెయ్యాలు, దుష్ట శక్తులు సంచరిస్తాయని పెద్దలు అంటుంటారు. కానీ ఇదొక అపోహ మాత్రమే. దీని వెనుక వృక్షశాస్త్ర రహస్యం ఉంది. రాత్రిపూట రావి చెట్టు పెద్ద మొత్తంలో చెడు గాలిని విడుదల చేస్తుంది. దానిని పీల్చడం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. దీని గురించి శాస్త్రీయంగా వివరించలేక దెయ్యాల పేర్లు చెప్పేవారు. అలా జనాలను ఈ చెట్టు వద్దకు వెళ్లకుండా చేసేవారు.