News September 5, 2024
చంద్రబాబు నిర్ణయంపై విచారణకు సిద్ధం: సీబీఐ

2003లో చంద్రబాబు సీఎంగా ఉండగా ఐఎంజీ సంస్థకు 850 ఎకరాలను అక్రమంగా కేటాయించారని ఆరోపిస్తూ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ దాఖలు చేసిన పిల్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. న్యాయస్థానం ఆదేశిస్తే చంద్రబాబు క్యాబినెట్ నిర్ణయంపై విచారణకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో తాము ఎప్పుడూ వెనకడుగు వేయలేదని చెప్పారు. ఈ పిల్పై నేడు కూడా కోర్టులో విచారణ జరగనుంది.
Similar News
News November 20, 2025
Alert: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు

AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని APSDMA తెలిపింది. తర్వాత 48 గంటల్లో మరింత బలపడుతుందని పేర్కొంది. నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని తెలిపింది.
News November 20, 2025
‘1600’ సిరీస్తోనే కాల్స్.. ట్రాయ్ కీలక ఆదేశాలు

దేశంలో పెరిగిపోతున్న స్పామ్, ఫ్రాడ్ కాల్స్కు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సంస్థలు తమ సర్వీసు, లావాదేవీల కాల్స్ కోసం 1600తో మొదలయ్యే నంబర్ సిరీస్ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు జనవరి 1 నాటికి, పెద్ద NBFCలు, పేమెంట్స్ బ్యాంకులు ఫిబ్రవరి 1 కల్లా, మిగతా NBFCలు, సహకార బ్యాంకులు, RRBలు మార్చి 1 లోపు ఈ సిరీస్కు మారాల్సి ఉంది.
News November 20, 2025
పోలి పాడ్యమి కథ అందిస్తున్న సందేశాలివే..

☞ భగవంతుడికి కావాల్సింది ఆడంబరం కాదు, పోలి వలె నిజాయితీ, తపనతో కూడిన శ్రద్ధ మాత్రమే.
☞ అహంకారం పతనానికి దారి తీస్తుందని అత్తగారి ఉదంతం హెచ్చరిస్తుంది. అహంకారంతో చేసే పూజలు నిష్ప్రయోజనం.
☞ సంకల్ప శక్తి ముఖ్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ధర్మాన్ని పాటించాలనే మనసు ఉంటే మార్గం దానంతట అదే దొరుకుతుంది.
☞ కుటుంబ సఖ్యత కోసం అసూయ, కంటగింపులను విడిచిపెట్టాలని ఈ కథ బోధిస్తుంది.


