News December 7, 2024
ఇండియా కూటమిని నడిపించేందుకు సిద్ధం: మమత
ఇండియా కూటమి నాయకత్వానికి తాను సిద్ధమేనని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. ‘ఆ కూటమిని నేనే ఏర్పాటు చేశా. ఇప్పుడు దానిని నడిపిస్తున్నవాళ్లకు నిర్వహణ చేతకాకుంటే నేనేం చేయగలను? అందరూ ఐక్యంగా ముందుకు సాగండనే చెప్తాను. బెంగాల్ను విడిచివెళ్లడం నాకిష్టం లేదు. అవకాశం లభిస్తే ఇక్కడి నుంచే నడిపిస్తాను’ అని అన్నారు. ఇక తన వారసుడిని నిర్ణయించే బాధ్యత పార్టీదేనని, సమష్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News January 24, 2025
గోల్డ్ రేట్స్ హైక్
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.82,420కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.300 పెరిగి రూ.75,550గా నమోదైంది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.వెయ్యి పెరిగి రూ.1,05,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.
News January 24, 2025
కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆర్థికసాయం అందించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. అమరావతికి హడ్కో రుణం, వరల్డ్ బ్యాంక్ సాయం వంటి అంశాలనూ కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. అనంతరం రామ్నాథ్ కోవింద్తోనూ బాబు భేటీ అవుతారు.
News January 24, 2025
దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఐటీ అధికారులు దిల్ రాజును సాగర్ సొసైటీలోని ఆయన కార్యాలయానికి తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ సోదాలు లేదా పలు అంశాలపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.