News September 23, 2024
రికార్డు సృష్టించిన బాలీవుడ్ మూవీ

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన ‘స్త్రీ2’ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీ ఇప్పటివరకు భారత్లో రూ.604.22 కోట్లు(నెట్) రాబట్టగా రూ.713 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు తెలిపింది.
Similar News
News November 26, 2025
మార్కాపురం జిల్లాలో.. మండలాలు ఇవే.!

మార్కాపురం జిల్లా భౌగోళిక స్వరూపంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త జిల్లాలో 21 మండలాలు ఉండనున్నాయి. వాటిలో Y.పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, CSపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు జాబితాలో ఉన్నట్లు సమాచారం.
News November 26, 2025
మార్కాపురం జిల్లాలో.. మండలాలు ఇవే.!

మార్కాపురం జిల్లా భౌగోళిక స్వరూపంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త జిల్లాలో 21 మండలాలు ఉండనున్నాయి. వాటిలో Y.పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, CSపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు జాబితాలో ఉన్నట్లు సమాచారం.
News November 26, 2025
అరుణాచల్ మాదే.. నిజాన్ని మార్చలేరు: భారత్

అరుణాచల్ తమ భూభాగమేనన్న చైనా <<18386250>>ప్రకటనను<<>> భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ‘భారత్లో అరుణాచల్ అంతర్భాగం. ఇదే వాస్తవం. చైనా తిరస్కరించినా నిజం మారదు’ అని స్పష్టం చేశారు. షాంఘై ఎయిర్పోర్టులో భారత ప్రయాణికురాలిని అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ రూల్స్, అన్ని దేశాల పౌరులకు 24hrs వీసా ఫ్రీ ట్రాన్సిట్ కల్పించే చైనా రూల్నూ అక్కడి అధికారులు పాటించలేదన్నారు.


