News May 25, 2024
కశ్మీర్ లోయలో రికార్డు పోలింగ్

కశ్మీర్ లోయలో పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. గత 35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అనంత్నాగ్-రాజౌరీ పార్లమెంటు నియోజకవర్గంలో 51.35% ఓటింగ్(సా.5గంటల వరకు) నమోదైనట్లు EC అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో కశ్మీర్లోని మూడు స్థానాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా శ్రీనగర్లో 38.49శాతం, బారాముల్లాలో 59.1% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. 2019లో ఈ మూడు చోట్ల సగటున 19.16శాతం పోలింగ్ నమోదైంది.
Similar News
News January 10, 2026
శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు: పవన్

AP: మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తత అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడకుండా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూంలో డయల్ 100 పనితీరుపై అధికారులను ఆరాతీశారు. అంతకుముందు పిఠాపురంలో గొల్లప్రోలు హౌసింగ్ వద్ద నిర్మించిన నూతన బ్రిడ్జిని ఆయన పరిశీలించారు.
News January 10, 2026
బడ్ చిప్ పద్ధతిలో చెరకు సాగుతో అధిక లాభం

తెలుగు రాష్ట్రాల్లో చెరకు ప్రధాన వాణిజ్య పంటగా లక్షల ఎకరాల్లో సాగవుతోంది. సాగు ఖర్చులు పెరగడం, కూలీల కొరత వల్ల క్రమంగా ఈ పంట సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఈ తరుణంలో చెరకులో సాగు ఖర్చులు తగ్గి, అధిక దిగుబడులు పొందడానికి కను చిప్పల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దీని సాయంతో నాణ్యమైన చెరకు నారు పెంచి, ప్రధాన పొలంలోని వరుసల్లో నాటినట్లయితే నికర ఆదాయం పెరిగి రైతులకు లాభం చేకూరుతుంది.
News January 10, 2026
చైనా, బంగ్లా ముప్పు.. బెంగాల్లో మన నేవీ బేస్!

చైనా, బంగ్లాదేశ్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈశాన్యంలో రక్షణను ఇండియా కట్టుదిట్టం చేస్తోంది. బెంగాల్లోని హల్దియాలో కొత్త నేవీ బేస్ను ఏర్పాటు చేయనుంది. 100 మంది ఆఫీసర్లు, సెయిలర్లను నియమించడంతోపాటు ఒక జెట్టీని, ఇతర ఫెసిలిటీస్ను నిర్మించనుంది. ఫాస్ట్ ఇంటర్సెప్టార్ క్రాఫ్ట్స్, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ వంటి చిన్న వార్ షిప్స్ను అక్కడ మోహరించనుంది. దీంతో అక్కడ నిఘా, రక్షణ పెరగనుంది.


