News August 20, 2024
రికార్డు సృష్టించిన TGSRTC

TG: రక్షాబంధన్ రోజు RTCలో 63 లక్షల మంది ప్రయాణించినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇందులో 41.74 లక్షల మంది మహిళలున్నట్లు తెలిపారు. దీనిద్వారా రికార్డు స్థాయిలో రూ.32కోట్లు రాబడి వచ్చిందన్నారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, టికెట్ల ద్వారా రూ.15 కోట్లు వచ్చాయని చెప్పారు. RTC చరిత్రలో ఇది ఆల్టైం రికార్డని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించినట్లు వెల్లడించారు.
Similar News
News October 18, 2025
విత్తనాలు కొంటున్నారా? రసీదు జాగ్రత్త..

రబీ సీజన్ ప్రారంభమైంది. విత్తనాల కొనుగోళ్లలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సీల్ తీసి ఉన్న, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లో విత్తనాలను కొనరాదు. తూకం వేసి విత్తనాలు తీసుకోవాలి. విత్తనం వల్ల పంట నష్టం జరిగితే రైతుకు విత్తన కొనుగోలు రశీదే కీలక ఆధారం. అందుకే పంటకాలం పూర్తయ్యేవరకు కొనుగోలు రశీదులను రైతులు జాగ్రత్తగా ఉంచాలి. పూత, కాత సరిగా రానిపక్షంలో నష్టపరిహారం కోసం రసీదు అవసరం.
News October 18, 2025
మీ దగ్గర స్కూళ్ల బంద్ ఉందా?

TG: BC సంఘాల ‘రాష్ట్ర బంద్’ పిలుపు మేరకు పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవులిస్తూ తల్లిదండ్రులకు మెసేజులు పంపాయి. OU పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కొన్ని స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడవనుండగా బంద్ పాటించాలని BC, విద్యార్థి సంఘాలు కోరే అవకాశముంది. మరోవైపు RTC డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఇప్పటికే పలు పార్టీలు రోడ్లపైకి వచ్చి బంద్ పాటిస్తున్నాయి. ఇంతకీ మీ దగ్గర స్కూళ్ల బంద్ ఉందా?
News October 18, 2025
వరి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరి పంట కోతకి వారం లేదా 10 రోజుల ముందు నుంచే నీటి తడిని ఆపివేయాలి. కంకిలో 90 శాతం గింజలు పక్వానికి వచ్చాకే వరి కోత చేపట్టాలి. గడ్డి పొడిపొడిగా, గింజలు బంగారు రంగులోకి, ఎర్ర గొలుసుగా మారి కంకులు కిందకి వంగినప్పుడు కోతలను చేపట్టాలి. పంట పక్వానికి రాకముందే కోస్తే, కంకిలోని గింజలు పూర్తిగా నిండక దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మరీ ఆలస్యంగా కోస్తే చేను పడిపోయి గింజ ఎక్కువగా రాలి దిగుబడి తగ్గే అవకాశం ఉంది.