News August 20, 2024

రికార్డు సృష్టించిన TGSRTC

image

TG: రక్షాబంధన్ రోజు RTCలో 63 లక్షల మంది ప్రయాణించినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇందులో 41.74 లక్షల మంది మహిళలున్నట్లు తెలిపారు. దీనిద్వారా రికార్డు స్థాయిలో రూ.32కోట్లు రాబడి వచ్చిందన్నారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, టికెట్ల ద్వారా రూ.15 కోట్లు వచ్చాయని చెప్పారు. RTC చరిత్రలో ఇది ఆల్‌టైం రికార్డని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించినట్లు వెల్లడించారు.

Similar News

News December 23, 2025

బంగ్లాదేశ్‌కు ‘సర్జరీ’ చేయాలి: అస్సాం సీఎం

image

బంగ్లాదేశ్‌తో దౌత్యానికి సమయం దాటిపోతోందని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఆ దేశంలో సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కోసం ‘సర్జరీ’ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల నార్త్ఈస్ట్‌కు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సిలిగురి కారిడార్‌‌ను కాపాడుకునేందుకు 20-22KM మేర భూమిని దౌత్యం లేదా బలవంతంగా అయినా తీసుకోవాలని సూచించారు. మెడిసిన్ పని చేయనప్పుడు సర్జరీ తప్పదన్నారు.

News December 23, 2025

4,116 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్‌ డేట్

image

RRC నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. టెన్త్, ఐటీఐలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. FEBలో మెరిట్ జాబితా విడుదల చేస్తారు. వెబ్‌సైట్: www.rrcnr.org *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News December 23, 2025

మిరపలో వేరు పురుగు వల్ల నష్టం

image

మిరప పంటను ఆశించే వేరు పురుగు మొక్కల వేర్లను కొరికి తినడం వల్ల మొక్కలు పసుపు రంగులోకి మారి క్రమంగా ఎండిపోతాయి. ఇవి నేలలో “C” ఆకారంలో తెల్లగా ఉంటాయి. మిరప పంట కాలపరిమితి దాటిన తర్వాత ఈ పురుగులు వేప, రేగు, మునగ వంటి పంటలను ఆశించి వాటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. ఈ వేరు పురుగు ఆశించిన మొక్కలు పీకితే సులభంగా ఊడి వస్తాయి. వీటి ఉద్ధృతి తీవ్రమైతే పెద్ద మొత్తంలో మొక్కలు చనిపోయి, దిగుబడి తగ్గిపోతుంది.