News August 20, 2024
రికార్డు సృష్టించిన TGSRTC

TG: రక్షాబంధన్ రోజు RTCలో 63 లక్షల మంది ప్రయాణించినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇందులో 41.74 లక్షల మంది మహిళలున్నట్లు తెలిపారు. దీనిద్వారా రికార్డు స్థాయిలో రూ.32కోట్లు రాబడి వచ్చిందన్నారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, టికెట్ల ద్వారా రూ.15 కోట్లు వచ్చాయని చెప్పారు. RTC చరిత్రలో ఇది ఆల్టైం రికార్డని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించినట్లు వెల్లడించారు.
Similar News
News December 16, 2025
SBI యోనో 2.0.. కొత్తగా 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్

SBI తాజాగా యోనో 2.0 పేరుతో నూతన యాప్ను విడుదల చేసింది. కస్టమర్లకు డిజిటల్ సేవలపై అవగాహన కల్పించేందుకు కొత్తగా 6,500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ‘బ్యాంకింగ్ను సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా MAR 31 నాటికి ఫ్లోర్ మేనేజర్ల స్థాయిలో 10K మంది రిక్రూట్మెంట్కు ప్లాన్ చేశాం. ఇప్పటికే 3,500 మందిని తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.
News December 16, 2025
SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

* యోనో 1.0లో ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారంగా 2.0 వెర్షన్ను SBI లాంచ్ చేసింది.
* UPI చెల్లింపులను సులభంగా చేయొచ్చు. డొమెస్టిక్/ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఆటోపే ఆప్షన్స్ ఉంటాయి.
* క్రెడిట్ స్కోర్ సిమ్యులేటర్ ఉంది. iOS యూజర్లకు ఫేస్ ఐడీ, ఆండ్రాయిడ్ కస్టమర్లకు బయోమెట్రిక్ సహా మల్టిపుల్ లాగిన్ ఆప్షన్లు ఉన్నాయి.
* ఈ యాప్ను మొబైల్తోపాటు టాబ్లెట్, డెస్క్టాప్స్ ద్వారా కూడా ఉపయోగించవచ్చు.
News December 16, 2025
AP న్యూస్ అప్డేట్స్

* మిషన్ వాత్సల్య పథకం కింద మహిళలు, పిల్లల సంరక్షణకు 53 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి.
* ఖరీఫ్ సీజన్లో 51L టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే 24.32L టన్నుల సేకరణ పూర్తి. 3.70 లక్షల మంది ఖాతాల్లోకి రూ.5,544 కోట్లు జమ.
* ఎరువుల డీలర్లు కృత్తిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్లించినా, ఎక్కువ ధరకు విక్రయించినా లైసెన్సులు రద్దు, కఠిన చర్యలు: వ్యవసాయ శాఖ


