News January 10, 2025
BGTలో రికార్డులే రికార్డులు!
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన BGTలో గ్రౌండ్లోనే కాకుండా బయట కూడా పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ సిరీస్ FOX స్పోర్ట్స్లో 1.4బిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అవడంతో పాటు 7కు పైగా ఛానళ్లలో 13.4M నేషనల్ ఆడియన్స్ను చేరుకుందని ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు తెలిపాయి. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో 2బిలియన్ వీడియో వ్యూస్ వచ్చినట్లు వెల్లడించాయి. ఈ సిరీస్లో IND 1-3తో ఓడిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News January 25, 2025
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డా: రష్మిక
సినిమాల్లో సక్సెస్ అయ్యేందుకు కుటుంబానికి సమయం కేటాయించడంలో రాజీ పడినట్లు హీరోయిన్ రష్మిక చెప్పారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదన్నారు. కుటుంబమే తన బలమని, ముఖ్యమైన సమయాల్లో ఫ్యామిలీతోనే గడుపుతానని పేర్కొన్నారు. షూటింగ్స్ వల్ల తనకు ఇష్టమైన చెల్లిని మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. కాగా, ఆమె నటించిన ‘ఛావా’ మూవీ FEB 14న రిలీజ్ కానుంది.
News January 25, 2025
VSR రాజీనామాకు ఆమోదం.. బులెటిన్ రిలీజ్
AP: రాజ్యసభ ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి చేసిన రాజీనామాను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. VSR రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ ఏర్పడింది. కాగా రాజకీయాలకు పూర్తిగా దూరమవుతున్నట్లు నిన్న విజయసాయి ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 25, 2025
రోహిత్కు గాయమైతే భారత్కు సమస్యే: అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడితే భారత జట్టు కష్టాల్లో పడుతుందని మాజీ క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ గాయపడితే వైస్ కెప్టెన్గా ఎంపికైన గిల్ కెప్టెన్సీ చేయాలి. కానీ అతడికి అనుభవం లేదు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. రోహిత్, కోహ్లీ, బుమ్రా లేకపోతే టీమ్ని నడిపించే వాళ్లెవరూ కనిపించడం లేదు. టీమ్ ఇండియాలో సమర్థమైన కెప్టెన్ల కొరత ఉంది’ అని తన యూట్యూబ్ వీడియోలో వివరించారు.