News November 27, 2024

త్వరలోనే డీఎస్సీ-2008 అభ్యర్థుల నియామకం

image

TG: డీఎస్సీ-2008 అభ్యర్థుల నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. 1400 మంది ఉద్యోగాలు చేయడానికి ముందుకు రాగా త్వరలోనే వీరిని కాంట్రాక్టు టీచర్లుగా నియమించనుంది. ఇప్పటికే వీరికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఇటీవల 10వేల మంది కొత్త టీచర్లను నియమించగా వీరి సర్దుబాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా SGT పోస్టుల్లో 30% డీఈడీ పూర్తి చేసిన వారికి కేటాయించడంతో కొందరు అభ్యర్థులు నష్టపోయారు.

Similar News

News November 14, 2025

పర్యావరణం కోసం ఈ వారియర్ మామ్స్

image

దిల్లీలో శీతాకాలం వచ్చిందంటే చాలు వాయుకాలుష్య తీవ్రత పెరిగిపోతుంది. దీన్ని ఎదుర్కోవడానికి బవ్రీన్‌ వారియర్‌ మామ్స్‌కు శ్రీకారం చుట్టారు. వాయుకాలుష్యం చర్మం, జుట్టు, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఆహార ఉత్పత్తుల్లోని పోషక విలువలను నాశనం చేస్తుందంటున్న బవ్రీన్ ఎన్నో ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారియర్ మామ్స్‌లో ప్రస్తుతం 1400లకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు.

News November 14, 2025

ప్రతిరోజూ ABC జ్యూస్ తాగితే జరిగేది ఇదే

image

ABC జ్యూస్.. యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో తయారు చేస్తారు. షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0.5గ్రా. ప్రొటీన్స్ లభించే ఈ జ్యూస్ తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. పరగడుపున తాగితే శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖం యంగ్‌గా కనిపిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువ ఉన్నందున బరువు తగ్గుతారు. 100మి.లీ జ్యూస్‌లో 45-50 కేలరీలు, 10-12గ్రా. కార్బోహైడ్రేట్లు బాడీకి అందుతాయి.

News November 14, 2025

పెరగనున్న ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు!

image

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు కొత్త ఫీజులకు సంబంధించిన జీవో రానున్నట్లు తెలుస్తోంది. 2025-27 పీరియడ్‌కు సంబంధించి కొత్త ఫీజుల ప్రతిపాదలను టీఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి పంపగా ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటంతో జీవో నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈసీ అనుమతితో విడుదల చేయనుంది.