News February 15, 2025

టీడీపీ నేతలను వేధించినవారిపై రెడ్‌బుక్ అమలు: లోకేశ్

image

AP: వైసీపీ హయాంలో జరిగిన అరాచకపాలన ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేశ్ చెప్పారు. చట్టాలను ఉల్లంఘించి టీడీపీ నేతలను ఇబ్బందిపెట్టిన వారిపై రెడ్ బుక్ అమలవుతుందని స్పష్టం చేశారు. తప్పుచేసిన వైసీపీ నేతలు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగళంలోనే చెప్పానన్నారు. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వల్లభనేని వంశీ జైలుకెళ్లారని, ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

Similar News

News January 10, 2026

‘నాకు సంబంధం లేదు’.. మరి ఎవరది?

image

తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు <<18810168>>అభ్యంతరం<<>>, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు <<18818989>>సంబంధం<<>> లేదని చెబుతున్నా అనుమతులు వస్తున్నాయి. మొన్న అర్ధరాత్రి ‘రాజాసాబ్’, తాజాగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ ధరల పెంపునకు అనుమతి వచ్చింది. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనుమతిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో ఉండగా రేట్ల పెంపు ఎవరు వెనక ఉండి నడిపిస్తున్నారనే చర్చ మొదలైంది.

News January 10, 2026

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

image

ప్రపంచంలో ఎక్కువగా <<18798755>>చమురు<<>> ఉత్పత్తి చేసేది అమెరికానే. 2025లో రోజూ 1.34 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అమ్మింది. అయినా ఇతర దేశాల నుంచి ఆయిల్ ఎందుకు కొంటోంది? తమ దగ్గర ఉత్పత్తి అయ్యే లైట్ క్రూడ్‌ విలువ ఎక్కువ కావడమే కారణం. తేలికపాటి ముడి చమురును అధిక ధరకు అమ్మి, హెవీ క్రూడ్‌ను తక్కువకే కొంటోంది. హెవీ క్రూడ్‌ను శుద్ధి చేసే రిఫైనరీలు USలో ఉండటం మరో కారణం. 2025లో 20L బ్యారెళ్లను కొనుగోలు చేసింది.

News January 10, 2026

1.75కోట్ల ఇన్‌స్టా యూజర్ల డేటా లీక్?

image

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్. సుమారు 1.75 కోట్ల మంది యూజర్ల సెన్సిటివ్ డేటా లీక్ అయినట్లు సైబర్ నిపుణులు వెల్లడించారు. యూజర్ల పేర్లు, మెయిల్స్, ఫోన్ నంబర్లు, అడ్రెస్‌లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు పేర్కొన్నారు. డేటా లీక్ వల్ల హ్యాకర్లు ఐడెంటిటీ థెఫ్ట్‌కు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యూజర్లు పాస్‌వర్డ్ మార్చుకోవాలని, ఇన్‌స్టా పేరుతో వస్తోన్న ఫేక్ మెయిల్స్ నమ్మొద్దని సూచించారు.