News July 13, 2024

గోదావరికి ఎర్రనీరు.. పులసకు రూ.24,000

image

AP: ఈ సీజన్లో గోదావరికి వరద ప్రారంభం కావడంతో పులస చేపల సందడి మొదలైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మం. రామరాజులంక వద్ద ఉన్న వశిష్ఠ గోదావరిలో కేజిన్నర బరువున్న పులస చేప చిక్కింది. దీన్ని ఓ వ్యక్తి రూ.24వేలకు కొనుగోలు చేశారు. ఏడాదిలో తక్కువ కాలం లభ్యం కావడం, రుచి అమోఘంగా ఉండటంతో పులస చేపలకు డిమాండ్ ఎక్కువ.

Similar News

News December 4, 2025

బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు సూచనలు

image

బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీచేయాలి. తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. ఏటా తొలకరిలో ఎండుపుల్లలను కత్తిరించి దూరంగా పారేయాలి. శిలీంధ్రాలకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కల కట్టడికి మల్చింగ్ విధానం అనుసరించాలి. కలుపు మందులు, రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ, తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

News December 4, 2025

పుతిన్ భారత పర్యటన షెడ్యూల్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సాయంత్రం 6.35 గం.కు ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు 11AMకు రాష్ట్రపతి భవన్‌లో స్వాగత కార్యక్రమం ఉంటుంది. 11.30AMకు మహాత్మాగాంధీ సమాధి (రాజ్‌ఘాట్) వద్ద నివాళి అర్పిస్తారు. 11.50AMకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తారు. 1.50PMకు మీడియా సమావేశం ఉంటుంది. 3.40PMకు బిజినెస్ ఈవెంట్, 7PMకు రాష్ట్రపతి ముర్ముతో సమావేశంలో పాల్గొంటారు.

News December 4, 2025

తొక్కిసలాటకు ఏడాది.. దయనీయస్థితిలో శ్రీతేజ్

image

గతేడాది Dec 4 రాత్రి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన <<14796361>>తొక్కిసలాటలో<<>> గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఏడాదైనా దయనీయంగానే ఉంది. తానంతట తాను అన్నం తినలేని స్థితిలో ఉలుకూపలుకూ లేకుండా పడి ఉంటున్నాడు. ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నాడు. అతడికి చికిత్స ఇప్పించేందుకు నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతున్నాయని, అల్లు అర్జున్ మేనేజర్‌ను సంప్రదిస్తే సానుకూల స్పందన లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు.