News July 13, 2024
గోదావరికి ఎర్రనీరు.. పులసకు రూ.24,000

AP: ఈ సీజన్లో గోదావరికి వరద ప్రారంభం కావడంతో పులస చేపల సందడి మొదలైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మం. రామరాజులంక వద్ద ఉన్న వశిష్ఠ గోదావరిలో కేజిన్నర బరువున్న పులస చేప చిక్కింది. దీన్ని ఓ వ్యక్తి రూ.24వేలకు కొనుగోలు చేశారు. ఏడాదిలో తక్కువ కాలం లభ్యం కావడం, రుచి అమోఘంగా ఉండటంతో పులస చేపలకు డిమాండ్ ఎక్కువ.
Similar News
News January 7, 2026
30ల్లో స్కిన్ కేర్ ఇలా..

30ల్లోకి అడుగుపెట్టాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. తేమనిచ్చే మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్, ఫేషియల్ ఎక్సర్సైజ్లు చేయడం కూడా మంచిది.
News January 7, 2026
జ్యోతిషం: పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలివే..

జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు వివాహ సమయాన్ని నిర్ణయిస్తాయి. జాతకంలో కళత్ర స్థానం బలహీనంగా ఉన్నప్పుడు, ఆ స్థానంలో శని, రాహువు గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు పెళ్లి ఆలస్యమవుతుంది. కుజ దోషం ఉన్నా, గురు గ్రహ అనుగ్రహం లోపించినా సంబంధాలు కుదరడం కష్టమవుతుంది. దోషాలను గుర్తించి తగిన శాంతులు చేయిస్తే ఆటంకాలు తొలగి వివాహ యోగం వస్తుంది. దోషాలు పోయేందుకు పరిష్కార మార్గాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 7, 2026
వరి మాగాణుల్లో వెల్లుల్లి సాగు.. మంచి దిగుబడి, ఆదాయం

మన దగ్గర సాధారణంగా వరి కోతలు పూర్తయ్యాక అదే భూమిలో మొక్కజొన్న, సన్ ఫ్లవర్, అపరాలు నాటుతుంటాం. బంగ్లాదేశ్లో మాత్రం వరి కోతలు పూర్తయ్యాక ఆ భూమిలో వెల్లుల్లి నాటుతారు. వరి పంటకు వేసిన ఎరువుల వల్ల నేల సారవంతంగా ఉంటుంది. భూమిలో తేమ, వరికి వాడిన ఎరువుల వల్ల వెల్లుల్లి పంట చాలా వేగంగా, పెద్ద పరిమాణంలో పెరుగుతుందని, దీని వల్ల తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం లభిస్తోందని అక్కడి రైతులు చెబుతున్నారు.


