News July 13, 2024

గోదావరికి ఎర్రనీరు.. పులసకు రూ.24,000

image

AP: ఈ సీజన్లో గోదావరికి వరద ప్రారంభం కావడంతో పులస చేపల సందడి మొదలైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మం. రామరాజులంక వద్ద ఉన్న వశిష్ఠ గోదావరిలో కేజిన్నర బరువున్న పులస చేప చిక్కింది. దీన్ని ఓ వ్యక్తి రూ.24వేలకు కొనుగోలు చేశారు. ఏడాదిలో తక్కువ కాలం లభ్యం కావడం, రుచి అమోఘంగా ఉండటంతో పులస చేపలకు డిమాండ్ ఎక్కువ.

Similar News

News February 18, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పెరిగి రూ.79,700లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 పెరగడంతో రూ.86,950లకు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000గా ఉంది. వివాహ శుభకార్యాల వేళ రోజూ ధరలు పెరగడంతో పెళ్లిళ్లు చేసేవారు ఆందోళన పడుతున్నారు.

News February 18, 2025

తక్కువ ధరకే ‘iPHONE 16 PRO MAX’.. ఎక్కడంటే?

image

యాపిల్ నుంచి కొత్తగా ఏ మోడల్ వచ్చినా కొనేందుకు జనం ఎగబడుతుంటారు. ప్రస్తుతం iPHONE 16 PRO MAX కాస్ట్లీయస్ట్. దీని ధరలు దేశాలను బట్టి మారుతుంటాయి. అయితే అతి తక్కువగా అమెరికాలో లభిస్తుంది. USలో కేవలం రూ.1.04లక్షలకే పొందొచ్చు. ఇక కెనడా & జపాన్‌లో రూ.1.07లక్షలు, హాంకాంగ్‌లో రూ.1.13 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.1.18 లక్షలు, చైనా& వియత్నాంలో రూ.1.19 లక్షలు, UAEలో రూ.1.20 లక్షలు, INDలో రూ.1.37 లక్షలుగా ఉంది.

News February 18, 2025

విజయ్‌తో డేటింగ్ రూమర్స్.. రష్మిక పోస్ట్ వైరల్

image

విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. రోజ్ ఫ్లవర్ బొకేను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఆమె ‘నా ముఖంపై చిరునవ్వు ఎలా తెప్పించాలో నీకు బాగా తెలుసు పాపలు❤️’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆ బొకే VDనే పంపించి ఉంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల విజయ్ ‘కింగ్‌డమ్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ సమయంలో రష్మిక అతడిని <<15440673>>పొగుడుతూ<<>> ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!