News June 15, 2024
తగ్గిన ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల అవస్థలు!

TG: రాష్ట్రంలోని 1,497 గ్రామాలకు RTC బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. 2014-15 నాటికి RTCలో 10,479 బస్సులు ఉండగా, 2024 నాటికి 8,574 మాత్రమే ఉన్నాయి. బస్సులు తక్కువగా ఉండడం, అనూహ్యంగా ప్రయాణికులు పెరగడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో కొత్త బస్సుల్ని తీసుకొస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు సూచిస్తున్నారు.
Similar News
News November 21, 2025
హైదరాబాద్ కలెక్టరేట్లో పానీ పరేషాన్

హైదరాబాద్ కలెక్టరేట్లో నీటి సమస్య నెలకొంది. నిత్యావసర పనులకూ నీరు లేక సిబ్బంది విలవిల్లాడుతున్నారు. పది రోజులుగా ఈ సమస్య నెలకొంది. పైప్లైన్ సమస్య కారణంగా నీటి ఇబ్బంది నెలకొంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగర వ్యాప్తంగా అనేక మంది సమస్యలతో కలెక్టరేట్కు వస్తుంటారు. ఇందులో నీటి సమస్య ఉండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News November 21, 2025
రైతుల ఆత్మహత్యాయత్నం.. మీ హామీ ఏమైంది రేవంత్: హరీశ్ రావు

TG: భూములు రిజిస్ట్రేషన్ కావడం లేదని MLA క్యాంపు/తహసీల్దార్ ఆఫీసుల వద్ద రైతులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఏమైంది రేవంత్? మీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. భూములపై రైతులకు హక్కు లేకుండా చేస్తోంది. 70వేల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.
News November 21, 2025
తీవ్ర కాలుష్యం.. ఢిల్లీలో స్కూల్ గేమ్స్ బ్యాన్!

ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో స్కూళ్లలో ఓపెన్ గ్రౌండ్ క్రీడలను నిషేధించే దిశగా అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాధారణంగా వింటర్ సీజన్లో ఢిల్లీలోని స్కూల్స్ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తుంటాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గేమ్స్ రద్దు అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. కాగా ఇండోర్ గేమ్స్ నిర్వహణకూ సౌకర్యాలు కల్పించాలని పేరెంట్స్ కోరుతున్నారు.


