News June 15, 2024
తగ్గిన ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల అవస్థలు!

TG: రాష్ట్రంలోని 1,497 గ్రామాలకు RTC బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. 2014-15 నాటికి RTCలో 10,479 బస్సులు ఉండగా, 2024 నాటికి 8,574 మాత్రమే ఉన్నాయి. బస్సులు తక్కువగా ఉండడం, అనూహ్యంగా ప్రయాణికులు పెరగడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో కొత్త బస్సుల్ని తీసుకొస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు సూచిస్తున్నారు.
Similar News
News November 30, 2025
TG న్యూస్ అప్డేట్స్

* 1,365 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిన్నటితో ముగిసింది.
* నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. నలుగురు విద్యార్థులు సస్పెండ్.
* చెన్నైలో DEC 2న జరిగే ఇగ్నిషన్ సదస్సులో పాల్గొనాల్సిందిగా KTRను శివ్ నాడార్ ఫౌండేషన్ ఆహ్వానించింది.
* విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు కీలకమైన IELTSలో ఉచిత శిక్ష ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది.
News November 30, 2025
అభిషేక్ శర్మ విధ్వంసం.. 32 బంతుల్లో సెంచరీ

SMATలో బెంగాల్తో మ్యాచులో పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్నారు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆయన, 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ (32 బంతుల్లో 64 రన్స్) కూడా వేగంగా ఆడుతున్నారు. ప్రస్తుతం ఆ జట్టు 11.5 ఓవర్లలో స్కోర్ 193/0గా ఉంది. అభిషేక్ ప్రస్తుతం 40 బంతుల్లో 124 పరుగులతో(7 ఫోర్లు, 14 సిక్సులు) ఉన్నారు. ఈ మ్యాచ్ HYD జింఖానా గ్రౌండ్స్లో జరుగుతోంది.
News November 30, 2025
నువ్వుల పంట నాటిన తర్వాత కలుపు నివారణ

నువ్వుల పంట విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 30%ఇ.సి. 700mlను కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల సమయంలో అంతరకృషితో కలుపును అరికట్టవచ్చు. అంతరకృషి సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో క్విజాలొఫాప్ ఇథైల్ 5%E.C 400ml లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.


