News November 21, 2024
విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా సంస్కరణలు: మంత్రి లోకేశ్

AP: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా ప్రయోజకులుగా తీర్చిదిద్దే సంస్కరణలు అమలుచేయాలని వారికి సూచించినట్లు ఆయన తెలిపారు. ‘GOVT స్కూళ్లలో అడ్మిషన్లను పెంచడం, టీచర్ల బదిలీలు పారదర్శకంగా చేసేందుకు యాప్ను తీసుకొస్తున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను APతో పంచుకోవాలని WB ప్రతినిధులను కోరా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 23, 2025
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 88 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంలో ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, పవర్గ్రిడ్, టాటా స్టీల్, LT, టైటన్ లాభాల్లో.. ఇన్ఫీ, TCS, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News December 23, 2025
పాపాలు చేసి స్వర్గానికి ఎలా వెళ్లాడు?

అజామిళుడు అనే బ్రాహ్మణుడు మోహం వల్ల ధర్మాన్ని వీడి పాపకార్యాలు చేస్తాడు. ఓసారి ఆయన మరణశయ్యపై ఉండగా తనను తీసుకెళ్లడానికి యమదూతలు వచ్చారు. వాళ్లను చూసి, భయంతో తన చిన్న పుత్రుడిని ‘నారాయణ’ అని పిలిచాడు. పాపపుణ్యాల గురించి తెలియని యమధూతలు ‘నారాయణ’ అనే విష్ణునామం వినగానే అతడిని యమపాశం నుంచి రక్షించారు. అజామిళుడు కేవలం భగవంతుడి నామాన్ని ఉచ్ఛరించడం వల్ల నరకానికి వెళ్లలేదు. దైవనామస్మరణకు ఉన్న శక్తి ఇది!
News December 23, 2025
పిల్లల్లో నులిపురుగుల ప్రభావం

పిల్లల్లో నులిపురుగులు రావడానికి ప్రధాన కారణం శుభ్రత లేకపోవడం. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకోసమే పిల్లలకు శుభ్రత గురించి చెప్పాలి.ఇవి పిల్లల శారీరక, మానసిక పెరుగుదలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. రక్తహీనత, పోషకాల లోపం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, విరేచనాలు అవుతాయి.


