News January 30, 2025

అలాంటి ఇళ్ల క్రమబద్ధీకరణ.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

image

AP: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. 2019 అక్టోబర్ 15ను కటాఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటే రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఉంటుంది. పేదలకు 150 గజాల వరకు ఉచితంగా, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్ధీకరిస్తారు.

Similar News

News February 13, 2025

మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్

image

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు మార్చిలో భూమి మీదకు రానున్నారు. వారం రోజుల మిషన్‌ కోసం వెళ్లి సాంకేతిక సమస్యలతో 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఆమె మార్చి మధ్యలో రానున్నట్లు NASA తెలిపింది. సునీతతో పాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ కూడా రానున్నట్లు పేర్కొంది. వీరిద్దరిని తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని వెల్లడించింది.

News February 13, 2025

నేటి నుంచి అందుబాటులోకి గ్రూప్-2 హాల్ టికెట్లు

image

AP: గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లను APPSC విడుదల చేసింది. నేటి నుంచి అభ్యర్థులు వాటిని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్షలకు వచ్చే సమయంలో హాల్ టికెట్లు మాత్రమే తీసుకురావాలని APPSC స్పష్టం చేసింది. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఎగ్జామ్ సెంటర్లలో 89,900 మంది పరీక్ష రాయనున్నారు.

News February 13, 2025

కోహ్లీ ఏ జట్టుపై ఎన్ని రన్స్ చేశారంటే?

image

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యధికంగా ఆస్ట్రేలియాపై 5393 పరుగులు (ఆల్ ఫార్మాట్స్) చేశారు. ఆ తర్వాత శ్రీలంక (4076), ఇంగ్లండ్ (4038), వెస్టిండీస్ (3850), సౌతాఫ్రికా (3306), న్యూజిలాండ్ (2915), బంగ్లాదేశ్ (1676), పాకిస్థాన్ (1170), ఆఫ్గానిస్థాన్ (347), జింబాబ్వే (305), నెదర్లాండ్స్ (125), ఐర్లాండ్ (88), హాంగ్ కాంగ్ (59), యూఏఈ (33), స్కాట్లాండ్‌పై 2 రన్స్ చేశారు.

error: Content is protected !!