News February 19, 2025

రేఖ or వర్మ.. కౌన్ బనేగా సీఎం?

image

దేశ రాజధాని ఢిల్లీ సీఎం ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. మ.3.30 గంటలకు ఢిల్లీ బీజేపీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. రేసులో మాజీ CM కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు ఈసారి హస్తిన పీఠాన్ని మహిళే అధిష్ఠిస్తారని, షాలిమార్ బాగ్ MLA రేఖా గుప్తానే పదవి వరించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

Similar News

News March 25, 2025

శ్రేయస్ తన సెంచరీ కోసం చూడొద్దని చెప్పారు: శశాంక్

image

GTతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(97*) సెంచరీ మిస్ అయిన విషయం తెలిసిందే. అయితే మరో ఎండ్‌లో శశాంక్ హిట్టింగ్ చేయడంతో అయ్యర్‌కు స్ట్రైక్ రాలేదు. ఇన్నింగ్స్ తర్వాత శశాంక్ దీనిపై మాట్లాడుతూ.. ‘నా సెంచరీ కోసం చూడొద్దు. నువ్వు షాట్లు ఆడు’ అని శ్రేయస్ తనతో చెప్పారన్నారు. తన వ్యక్తిగత స్కోర్ కోసం కాకుండా జట్టు కోసం ఆలోచించిన కెప్టెన్ అయ్యర్‌ను ఫ్యాన్స్ పొగుడుతున్నారు.

News March 25, 2025

ఆ హీరోయిన్‌ మృతితో హీరోకు సంబంధం లేదు: మాజీ ప్రియుడు

image

దక్షిణ కొరియా నటి <<15483613>>కిమ్ సె రాన్<<>> మృతికి నటుడు కిమ్ సూ హ్యూన్, మరో యూట్యూబర్ కారణం కాదని ఆమె మాజీ ప్రియుడు స్పష్టం చేశారు. నిజానికి తనను పట్టించుకోని కుటుంబం వల్లే ఆమె ఎంతో వేదన చెందారని తెలిపారు. న్యూయార్క్‌లో ఆమె రహస్యంగా ఒకరిని పెళ్లిచేసుకొని లైంగిక బంధం కొనసాగించారని వెల్లడించారు. ఇన్నాళ్లూ పట్టించుకోని కుటుంబం ఇప్పుడొచ్చి వేరొకరిని నిందిస్తుండటం బాధాకరమని విమర్శించారు.

News March 25, 2025

సౌలభ్యాన్ని బట్టి త్వరలోనే బకాయిల విడుదల: సీఎం

image

AP: గ‌త ప్ర‌భుత్వం ఉద్యోగులకు రూ.20,637 కోట్ల అలవెన్సులను ఎగ్గొట్టిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము ఇప్పటికే రూ.7,230 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. త్వరలోనే సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిలను అకౌంట్లలో జమ చేస్తామని కలెక్టర్ల సదస్సులో హామీ ఇచ్చారు. ఉద్యోగులు ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి చొర‌వ తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

error: Content is protected !!