News May 25, 2024
విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ విడుదలైంది. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. 2025 ఫిబ్రవరి 28లోపు టెన్త్ ప్రిఫైనల్, మార్చిలో ఫైనల్ పరీక్షలు ఉంటాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఉ.9.30 నుంచి సా.4.45 వరకు ఉన్నత పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తారు.
Similar News
News February 13, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్గా శిఖర్ ధవన్

భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఛాంపియన్స్ ట్రోఫీకి అంబాసిడర్గా నియమితులయ్యారు. అతనితో పాటు PAK క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్, AUS మాజీ ఆల్రౌండర్ వాట్సన్, NZ మాజీ పేసర్ సౌథీని ICC అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. 2013లో భారత్ CT గెలవడంలో గబ్బర్ కీలకంగా వ్యవహరించారు. అలాగే, టోర్నీ చరిత్రలో వరుసగా 2సార్లు ‘గోల్డెన్ బ్యాట్’ అవార్డ్ అందుకున్న ఏకైక క్రికెటర్గా నిలిచినందుకు శిఖర్కు ఈ గౌరవం దక్కింది.
News February 13, 2025
దేశంలోనే కర్నూలులో హై టెంపరేచర్

AP: రాష్ట్రంలో మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలులో బుధవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 37.8°C నమోదైంది. రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
News February 13, 2025
రేషన్ కార్డులు.. ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఫిర్యాదు చేయండిలా!

TG: రేషన్ కార్డు దరఖాస్తు కోసం మీ-సేవ నిర్వాహకులు రూ.50 మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని చోట్ల ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయా సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విచారణ జరిపి వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ఎవరైనా ఎక్కువ డబ్బులు తీసుకుంటే మీ-సేవ హెల్ప్ లైన్ నంబర్ 1100కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.