News December 31, 2024
రాబిన్ ఉతప్పకు రిలీఫ్: అరెస్టు నుంచి రక్షణ కల్పించిన హైకోర్టు

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు భారీ ఊరట లభించింది. EPF డిపాజిట్ల అక్రమాల కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా కర్ణాటక హైకోర్టు వెకేషన్ బెంచ్ అతడికి రక్షణ కల్పించింది. సెంటారస్ బ్రాండ్స్లో 2018-2020 వరకు ఉతప్ప డైరెక్టర్గా పనిచేశారు. ఉద్యోగుల వేతనాల్లోంచి కత్తిరించిన రూ.23.36 లక్షలను పీఎఫ్ అకౌంట్లలో కంపెనీ జమ చేయలేదు. దీంతో ఉతప్ప సహా మిగిలిన వారికి EPFO అధికారులు నోటీసులు పంపించారు.
Similar News
News November 6, 2025
ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి ?

ఆయుష్షు కోరుకునేవారు తూర్పు ముఖంగా, కీర్తి, పేరు ప్రఖ్యాతలు కోరుకునేవారు దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు దిశ నుంచి ప్రాణ, సానుకూల శక్తి వస్తుంది. ఈ శక్తి భోజనం చేసేటప్పుడు శరీరంలోకి ప్రవహించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం ఆయురారోగ్యాలను ఇవ్వడానికి, ఉత్తమ ఫలితాలను పొందడానికి ఈ నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవడం, మౌనం పాటించడం మంచిది.
News November 6, 2025
5,346 టీచర్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఢిల్లీలో 5,346 <
News November 6, 2025
కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇంకెప్పుడు?

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై 3 నెలలు పూర్తవుతున్నా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంపై అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. వెంటనే శిక్షణ ప్రారంభించాలని కోరుతున్నారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు 2022 NOVలో నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ పూర్తయినా లీగల్ చిక్కులతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. గతేడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి ఆగస్టులో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా ట్రైనింగ్ ప్రారంభం కాలేదు.


