News October 18, 2024

జేఈఈ మెయిన్‌లో ఆప్షనల్ క్వశ్చన్స్ ఎత్తివేత

image

జేఈఈ మెయిన్ నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఇక నుంచి సెక్షన్ Bలో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవని వెల్లడించింది. కరోనా సమయంలో విద్యార్థులకు రిలీఫ్ ఇచ్చేందుకు 2021లో ఛాయిస్ విధానాన్ని తెచ్చింది. సెక్షన్ Bలో 10 ప్రశ్నలకు ఐదింటికి ఆన్సర్స్ రాయాల్సి ఉండేది. 2024 వరకు దీన్ని కొనసాగించారు. 2025 నుంచి 5 క్వశ్చన్సే ఇస్తామని, అవన్నీ రాయాల్సి ఉంటుందని వివరించింది.

Similar News

News December 27, 2025

AIIMS రాయపుర్‌లో 100 సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు

image

<>AIIMS <<>>రాయపుర్‌ 100 Sr. రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB/డిప్లొమా ఉత్తీర్ణులు JAN 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, మహిళలు, SC,ST, PwBDలకు ఫీజు లేదు. నెలకు రూ. 67,000+అలవెన్సులు చెల్లిస్తారు. https://www.aiimsraipur.edu.in

News December 27, 2025

వరుసగా 5 సెంచరీలతో రికార్డు

image

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ ధ్రువ్ షోరే రికార్డు సృష్టించారు. హైదరాబాద్‌తో రాజ్‌కోట్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో 77 బంతుల్లో అజేయంగా 109 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్స్‌లు) చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. దీంతో లిస్ట్-A క్రికెట్‌లో వరుసగా 5 సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా తమిళనాడు ప్లేయర్ జగదీశన్ రికార్డును సమం చేశారు. ఈ మ్యాచ్‌లో విదర్భ 365 రన్స్ చేయగా, హైదరాబాద్ 276కే పరిమితమైంది.

News December 27, 2025

10 రోజుల్లో ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం: TTD EO

image

AP: వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులు ఆందోళన చెందవద్దని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని, ఆ పవిత్ర రోజుల్లో ఏ రోజు స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని పండితులు చెప్పారని పేర్కొన్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించామని వివరించారు.