News September 9, 2024

సోషల్ మీడియా నుంచి ఆ ఫొటోలు తొలగించండి: SC

image

కోల్‌క‌తా హ‌త్యాచార బాధితురాలి ఫొటోల‌ను ఎల‌క్ట్రానిక్, సోషల్ మీడియా నుంచి తొల‌గించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనుమ‌తి లేకుండా మృతదేహానికి పోస్టుమార్టం ఎలా చేశార‌ని, అస‌లు పోస్టుమార్టానికి అంగీకార వివ‌రాలు, కార‌ణాలు తెలిపే చ‌లాన్ ఎక్క‌డ‌ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. మ‌ృతదేహంతోపాటు ఏయే వస్తువులు ఉన్నాయన్నది చలాన్ వెల్లడిస్తుందని, అయితే పోలీసులు దీన్ని అప్పగించలేదని కోర్టుకు CBI తెలిపింది.

Similar News

News December 6, 2025

వాస్తుతో తలరాతను మార్చుకోవచ్చా?

image

కార్యసాధన, పట్టుదలతో బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఈ ప్రయత్నానికి ఇంటి వాస్తు కూడా దోహదపడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పేర్కొంటున్నారు. ‘వాస్తు నియమాలు పాటిస్తే.. పంచభూతాల ఆధారంగా మన ఆలోచనలు, నడవడిక, శక్తి సానుకూలంగా మారుతాయి. దీనివల్ల సమయస్ఫూర్తి పెరుగుతుంది. తద్వారా మనకు వచ్చే అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోగలుగుతాం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 6, 2025

95% కనెక్టివిటీని పునరుద్ధరించాం: ఇండిగో

image

95% నెట్‌వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించినట్లు ఇండిగో తెలిపింది. నిన్న 700కు పైగా సర్వీసులు అందుబాటులో ఉంచగలిగామని ఈరోజు మొత్తంలో 1500 ఫ్లైట్లను నడుపుతున్నామని శనివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘138 గమ్యస్థానాలకుగాను 135 ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించాం. మా ప్రయాణికుల నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాం. సంక్షోభంలో మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అని చెప్పింది.

News December 6, 2025

కోట్ల మందికి తాగునీటి కొరత!

image

2050 నాటికి కోట్ల మందికి తాగునీరు అందని పరిస్థితి తలెత్తవచ్చని తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరిస్తోంది. వియన్నాకు చెందిన కాంప్లెక్సిటీ సైన్స్‌ హబ్‌, ప్రపంచ బ్యాంక్‌ కలిసి ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాలోని 100కు పైగా నగరాలను పరిశీలించాయి. ఇష్టారీతిన విస్తరించుకుంటున్న నగరాల వలన 220M మందికి స్వచ్ఛమైన నీరు అందదని వెల్లడించింది. సరైన ప్రణాళిక ద్వారానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని సూచించింది.