News August 12, 2025

ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత

image

TG: వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత(67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం ఓ పుస్తకావిష్కరణలో యాక్టివ్‌గా కనిపించిన ఆమె అకస్మాత్తుగా మరణించడం సాహితీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక అంశాలపై ఆమె రాసిన పుస్తకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. TG తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాయి. 500 కవితలు, 100 వ్యాసాలు, 30కి పైగా పాటలు రాశారు.

Similar News

News August 12, 2025

బండి సంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసు

image

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి BRS నేత KTR లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై తన పరువుకు నష్టం కలిగించేలా అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. హైకోర్టు జడ్జిలు, ప్రస్తుత CM, మాజీ సీఎం KCR కూతురు, అల్లుడు సహా వేలాది మంది ఫోన్లను KTR ట్యాప్ చేయించారంటూ సంజయ్ ఆరోపించారని నోటీస్‌లో మెన్షన్ చేశారు. వారంలోగా క్షమాపణలు చెప్పకపోయినా, మళ్లీ ఆరోపణలు చేసినా లీగల్‌ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

News August 12, 2025

జమ్మలమడుగు ఓటర్లతో టీడీపీ రిగ్గింగ్: YCP

image

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. జమ్మలమడుగు నుంచి వచ్చిన స్థానికేతర ఓటర్లు నల్లపురెడ్డి పల్లె గ్రామంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ పొన్నతోట మల్లి ఓటేసేందుకు పోలింగ్ కేంద్రం వద్ద లైనులో నిలబడిన ఫొటోను వైసీపీ ట్వీట్ చేసింది.

News August 12, 2025

అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

image

పంట బీమా(PMFBY) కోసం నిన్న కేంద్రం రైతుల ఖాతాలకు రూ.3900 కోట్లు బదిలీ చేసింది. రైతులు తమ ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయా? లేదా? అని తెలుసుకునేందుకు <>pmfby.gov.in<<>> వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఫార్మర్ కార్నర్ ఆప్షన్‌కు వెళ్లి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. పాలసీ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుస్తుంది.