News May 24, 2024

BLOలకు రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలని ఈసీకి వినతి

image

AP: ఈ నెల 13న ఒక్కో పోలింగ్ స్టేషన్ నిర్వహణకు రూ.10,000 వ్యయమైందని VROల సంఘం తెలిపింది. ఆ మొత్తాన్ని BLOలు, VROలకు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు వినతిపత్రం అందించింది. కొన్నిచోట్ల రూ.2వేల నుంచి రూ.8వేలే ఇచ్చారని, దీనివల్ల చిరు ఉద్యోగులు నష్టపోతారంది. అలాగే మూడేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసిన BLOలకు రూ.18వేలను రిలీజ్ చేయాలని కోరింది.

Similar News

News November 15, 2025

గుడ్‌న్యూస్.. ఈ నెల 19న PM కిసాన్ డబ్బులు

image

PM కిసాన్ 21వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ప్రధాని మోదీ.. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.

News November 15, 2025

పీఎం కిసాన్ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

image

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేసుకోండి. ☛ ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాలి.
☛ ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
☛ అక్కడ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం (మీ వ్యవసాయ భూమి ఉన్న గ్రామం) వివరాలను ఎంపిక చేసుకొని ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
☛ అక్కడ గ్రామాల వారీగా లబ్దిదారుల జాబితా వస్తుంది.

News November 15, 2025

యూపీఐతో టోల్ చెల్లింపు.. ఛార్జీ భారీగా తగ్గింపు!

image

ఫాస్టాగ్ పనిచేయని, చెల్లుబాటు కాని వాహనదారులకు భారీ ఉపశమనం దక్కింది. ఫాస్టాగ్ లేకుంటే నేషనల్ హైవేలపై గతంలో టోల్ గేట్ల వద్ద రూ.100 చెల్లించాల్సి ఉంటే రూ.200 వరకు ఛార్జీ వసూలు చేసేవారు. అయితే నేటి నుంచి UPI ద్వారా పేమెంట్స్ చేస్తే రూ.100కు 25% అదనంగా అంటే రూ.125 చెల్లించి వెళ్లిపోవచ్చు. ఈ విధానం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే క్యాష్ ఇవ్వాలనుకుంటే రూ.100కు రూ.200 చెల్లించాల్సిందే.