News May 24, 2024

BLOలకు రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలని ఈసీకి వినతి

image

AP: ఈ నెల 13న ఒక్కో పోలింగ్ స్టేషన్ నిర్వహణకు రూ.10,000 వ్యయమైందని VROల సంఘం తెలిపింది. ఆ మొత్తాన్ని BLOలు, VROలకు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు వినతిపత్రం అందించింది. కొన్నిచోట్ల రూ.2వేల నుంచి రూ.8వేలే ఇచ్చారని, దీనివల్ల చిరు ఉద్యోగులు నష్టపోతారంది. అలాగే మూడేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసిన BLOలకు రూ.18వేలను రిలీజ్ చేయాలని కోరింది.

Similar News

News November 21, 2025

ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి అప్డేట్

image

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌పై అప్డేట్ వచ్చింది. ‘రెబల్ సాబ్’ అనే సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.

News November 21, 2025

NCCDలో ఉద్యోగాలు

image

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్‌ (NCCD) 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 8వరకు అప్లై చేసుకోవచ్చు. contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: nccd.gov.in.

News November 21, 2025

రాజధాని రైతులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం: నారాయణ

image

AP: రాజధానిలో రైతులకిచ్చిన ప్లాట్‌లలో మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలోని పలు గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు. ‘69,421 మంది రైతులకు 61,433 ప్లాట్‌ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 991మంది రైతులకే ప్లాట్‌లు కేటాయించాల్సి ఉంది. కొందరు తమకు కావాల్సిన చోట ప్లాట్లు అడుగుతున్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగదు. ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం’ అని మంత్రి స్పష్టం చేశారు.