News May 12, 2024
ఫ్యాన్స్కు రిక్వెస్ట్.. CSK పోస్ట్ వైరల్

చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్గా మారింది. ప్రస్తుతం చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ జరుగుతుండగా ఫ్యాన్స్ కోసం CSK ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ‘ఈ మ్యాచ్ తర్వాత వెంటనే వెళ్లిపోకండి. కాసేపు స్టేడియంలోనే ఉండండి. ఒక ప్రత్యేక మెసేజ్ మీ ముందుకు రాబోతోంది’ అని ట్వీట్ చేసింది. ఈ సీజన్లో చెన్నై వేదికగా CSKకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
Similar News
News February 9, 2025
కోతి చేష్టలతో లంకలో చీకట్లు

ఓ కోతి నిర్వాకం వల్ల శ్రీలంకలో చీకట్లు అలుముకున్నాయి. సౌత్ కొలంబో ప్రాంతంలోని మెయిన్ పవర్ గ్రిడ్ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన తీగలపై ఓ కోతి వేలాడటంతో అకస్మాత్తుగా విద్యుత్ నిలిచిపోయింది. దీంతో కొలంబో నగరవ్యాప్తంగా కొన్ని గంటలపాటు కరెంటు సరఫరా కాలేదు. కొన్ని ప్రాంతాల్లో 5-6 గంటలపాటు కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది.
News February 9, 2025
PHOTO: ఒకే ఫ్రేమ్లో మెగా హీరోలు

మెగా హీరోలు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్తో కలిసి జిమ్లో ఉన్న ఫొటోను మరో హీరో వరుణ్ తేజ్ పంచుకున్నారు. జిమ్ ట్రైనర్తో కలిసి వారు ఫొటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ RC16లో బిజీగా ఉండగా ‘సంబరాల ఏటి గట్టు’తో సాయి ధరమ్ తేజ్, మేర్లపాక గాంధీ సినిమాతో వరుణ్ బిజీగా ఉన్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ చాలా కాలం తర్వాత మెగా హీరోలను ఒకే ఫ్రేమ్లో చూడటం సంతోషంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
News February 9, 2025
ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్తో నిలిచిన మ్యాచ్.. ఇంగ్లండ్ ఫ్యాన్స్ సెటైర్లు

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డే ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్ కారణంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఎవరైనా ఎలక్ట్రీషియన్ స్టేడియంలో దగ్గరలో ఉంటే రావాలని ENG ఫ్యాన్స్ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు. ప్రపంచంలోనే రిచ్ క్రికెట్ బోర్డు ఇలాంటి వసతులతో మ్యాచ్ నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ ఆగితే ఇంగ్లండ్ ఓటమి నుంచి గట్టెక్కుతుందని కొందరు భారత ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.