News January 4, 2025
5 ఎకరాల్లోపే రైతుభరోసా ఇవ్వాలని వినతి

TG: రైతుభరోసా పథకాన్ని 5 ఎకరాలలోపు రైతులకే అమలు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వాన్ని కోరింది. బీడు భూములకు, వందల ఎకరాలున్న వారికి పథకం అమలు చేస్తే ఖజానాపై భారం పడుతుందని పేర్కొంది. భూస్వాములు, IT చెల్లించే శ్రీమంతులను పథకానికి దూరం చేయాలని కోరింది. కౌలు రైతులను ఈ పథకంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కోసం రేపటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి, జనవరి 14న నగదు జమ చేయనుంది.
Similar News
News November 7, 2025
యువత కోసం CMEGP పథకం!

AP: యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా CM ఉపాధి కల్పన (CMEGP) పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్కి ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేయనుంది. గ్రామీణ యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సేవారంగంలో రూ.2లక్షల-రూ.20 లక్షలు, తయారీ రంగంలో రూ.10 లక్షల-రూ.50 లక్షల వరకు రుణాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని, ఈనెల 10న క్యాబినెట్లో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.
News November 7, 2025
మంత్రాల వల్ల నిజంగానే ఫలితం ఉంటుందా?

మంత్రాల శక్తిని కొందరు నమ్మకపోయినా, అవి నిజంగానే సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. మంత్రాలను పదే పదే జపించడం ధ్యానంలాగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో మనస్సు మంత్రంపై కేంద్రీకృతమై ఏకాగ్రత పెరుగుతుంది. మంత్ర జపంతో ఉత్పన్నమయ్యే లయబద్ధ శబ్ద తరంగాలు మనలో మానసిక ప్రశాంతతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫలితంగా మనలో సానుకూల శక్తి పెరిగి, జీవితం పట్ల మంచి దృక్పథం కలుగుతుంది.
News November 7, 2025
చరిత్ర సృష్టించిన శీతల్.. సాధారణ ఆర్చర్లతో పోటీ

పారా కాంపౌండ్ ఆర్చరీలో శీతల్ దేవి వరల్డ్ ఛాంపియన్గా నిలవడమే కాకుండా అనేక పతకాలు గెలిచారు. ఆమె ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. జెడ్డా వేదికగా జరగనున్న ఆసియా కప్ స్టేజ్-3లో పోటీ పడే భారత జట్టుకు ఎంపికయ్యారు. సాధారణ ఆర్చర్ల జట్టులోకి పారా ఆర్చర్ ఎంపికవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ట్రయల్స్లో ఆమె ఓవరాల్గా 3వ స్థానంలో నిలిచారు.


