News December 24, 2024
రీరిలీజ్ మేనియా.. మరోసారి థియేటర్లలోకి ఓయ్, నేనింతే
టాలీవుడ్లో మరోసారి రీరిలీజ్ మేనియా మొదలైంది. సిద్ధార్థ్ హీరోగా ఆనంద్ రంగా తెరకెక్కించిన ‘ఓయ్’ మూవీ మరోసారి రీరిలీజ్కు సిద్ధమైంది. కొత్త ఏడాదిని ఓయ్తో ప్రారంభించేందుకు జనవరి 1న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఈ చిత్రం రీరిలీజైంది. అలాగే మాస్ మహారాజా రవితేజ బర్త్ డే సందర్భంగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘నేనింతే’ మూవీ జనవరి 26న విడుదల కానుంది.
Similar News
News January 20, 2025
పని నాణ్యతే ముఖ్యం: భారత్ పే సీఈఓ
వారంలో 90 గంటలు పనిచేయడమనేది చాలా కష్టమని భారత్ పే CEO నలిన్ నెగీ తెలిపారు. వర్క్ అవర్స్ కంటే ఎంత నాణ్యతతో పని చేశామనేదే ముఖ్యమన్నారు. ఉద్యోగి ఒత్తిడితో కాకుండా సంతోషంగా పనిచేస్తేనే సంస్థకు లాభమని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్ టీ ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
News January 20, 2025
DANGER: రోజూ ఒకే సమయానికి నిద్ర పోవట్లేదా?
చాలామంది ఉద్యోగులు షిఫ్టుల వల్ల నిత్యం ఒకే సమయానికి నిద్రపోరు. దీన్నే ‘సోషల్ జెట్లాగ్’ అంటారు. ఒక వారంలో నిద్రపోయే సమయాల్లో 90 నిమిషాలు తేడా వస్తే శరీరంలో మైక్రోబయోటా జాతులు ఉత్పత్తి అవుతాయని సైంటిస్టులు గుర్తించారు. అలాంటివారికి ఎక్కువగా చిప్స్, షుగరీ ఫుడ్స్ తినాలనిపిస్తుందని తెలిపారు. ఫలితంగా సరైన ఆహారం తీసుకోలేకపోవడం, ఊబకాయం, కడుపులో మంట, స్ట్రోక్ ముప్పు తలెత్తవచ్చని సైంటిస్టులు తేల్చారు.
News January 20, 2025
ఇన్ఫోసిస్లో జీతాలే పెరగవు.. మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్
ఇన్ఫోసిస్లో శాలరీ హైక్ చాలా తక్కువని సంస్థ మాజీ ఉద్యోగి తెలిపారు. 9 ఏళ్లు పనిచేసి 2017లో రిజైన్ చేసేనాటికి తన జీతం రూ.35 వేలు మాత్రమేనన్నారు. వేరే టెక్ కంపెనీలో చేరగా 4 ఏళ్లలో నెల వేతనం రూ.1.75 లక్షలకు చేరిందని చెప్పుకొచ్చారు. క్యాబ్, పార్కింగ్ వంటి సదుపాయాలు కూడా ఇన్ఫోసిస్లో ఉండేవి కావన్నారు. ప్రస్తుత కంపెనీలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని రెడిట్లో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.