News February 15, 2025
42 శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో తీర్మానం: సీఎం రేవంత్

TG: తాము చేసిన కులగణనలో ఒక్క తప్పున్నా చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ ‘మా సర్వేను మొత్తం 5 కేటగిరీలుగా విభజించాం. హిందూ, ముస్లిం బీసీలు కలిపి 56 శాతం అయ్యారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై త్వరలో అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తాం’ అని చెప్పారు. కాగా అంతకుముందు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
Similar News
News February 1, 2026
పాక్లో దాడులు.. 125 మంది మృతి

పాక్ అధీనంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో BLA రెబల్స్, ఆర్మీ మధ్య జరిగిన <<19013238>>దాడుల్లో<<>> 125 మంది చనిపోయారు. 12 ప్రాంతాల్లో BLA దాడులు చేసిందని, అందులో 18 మంది సెక్యూరిటీ సిబ్బంది, 15 మంది పౌరులు చనిపోగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరోవైపు 92 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు చెప్పాయి. అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని సమాచారం.
News February 1, 2026
ప్రకృతి సేద్యంలో చీడపీడల కట్టడి ఎలా?

పర్యావరణానికి, ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ విధానంలో కూడా చీడపీడల సమస్య ఉంటుంది. రసం పీల్చే పురుగులు, ఆకుముడత, కాండం, కాయతొలిచే పురుగులు, వేరు పురుగుల ఉద్ధృతి కనిపిస్తోంది. వీటిని బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, నీమాస్త్రాలతో కట్టడి చేయవచ్చు. ఈ సహజ పురుగు మందుల తయారీ విధానం, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News February 1, 2026
మానసిక ఆరోగ్యం కోసం ఇవి తినాల్సిందే..

సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఒత్తిడి, నిద్రలేమి, మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. వేపుళ్లు, తీపి పదార్ధాలు, మాంసం ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే వాటి వల్ల ఇన్ఫ్లమేష్ పెరిగి మానసిక ఒత్తిడికి దారితీస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఐరన్, జింక్, ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, చీజ్, ఆమ్లా, అవకాడో, ఆలివ్ నూనె డైట్లో చేర్చుకోవాలి.


