News November 21, 2024
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తీర్మానం

AP: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. మంత్రి ఎన్ఎండీ ఫరూక్ దీన్ని సభలో ప్రవేశపెట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉండగా, గతంలో చంద్రబాబు కూడా దీనిపై హామీ ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై సభలో చర్చించి ఆమోదం తెలపనున్నారు.
Similar News
News November 17, 2025
ఆటోడ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: KTR

TG: ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైరయ్యారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రెన్యూవల్ చేయకపోవడంతో బీమా సౌకర్యం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని 5 వేల మంది ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా తానే కడతానని పేర్కొన్నారు.
News November 17, 2025
ఆటోడ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: KTR

TG: ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైరయ్యారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రెన్యూవల్ చేయకపోవడంతో బీమా సౌకర్యం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని 5 వేల మంది ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా తానే కడతానని పేర్కొన్నారు.
News November 17, 2025
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించింది. కొత్త గైడ్లైన్స్ ప్రకారం బదిలీలు ఉంటాయని పేర్కొంది. డిసిప్లినరీ, ACB కేసులు ఉన్నవారు ట్రాన్స్ఫర్కు అనర్హులని తెలిపింది. ప్రొవిజనల్ సీనియారిటీ, క్లియర్ వేకెన్సీ ఆధారంగా బదిలీ అవుతారంది. పోర్టల్ ద్వారానే అప్లై చేసుకోవాలని, శాఖా సెక్రటరీలు ఇంటర్ బదిలీ ఆర్డర్లు ఇస్తారని తెలిపింది.


