News March 30, 2024

కాచిన నూనె మళ్లీ వంటలకు వాడుతున్నారా?

image

కాచిన నూనెను మళ్లీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని అమెరికా సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ అధ్యయనంలో వెల్లడైంది. క్యాన్సర్, కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాచిన నూనెల వల్ల శారీరక సమతుల్యత దెబ్బతింటుందని, క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని, జీర్ణ వ్యవస్థ, కాలేయం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ స్థాయులూ పెరుగుతాయని వెల్లడించారు.

Similar News

News January 13, 2025

టెస్టు కెప్టెన్‌గా జైస్వాల్‌ను ప్రతిపాదించిన గంభీర్?

image

రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై BCCI తీవ్ర కసరత్తు చేస్తోంది. నిన్న, ఈరోజు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కోచ్ గంభీర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే వర్క్‌లోడ్ ఎక్కువవుతుందని భావించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సెలక్షన్ కమిటీ తెరపైకి పంత్ పేరును తీసుకొచ్చిందని సమాచారం. అయితే గంభీర్ అనూహ్యంగా జైస్వాల్ పేరును ప్రతిపాదించారట. మరి దీనిపై BCCI ఏమంటుందో చూడాలి.

News January 13, 2025

ఉక్రెయిన్‌తో యుద్ధంలో కేరళ వాసి మృతి

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో ర‌ష్యా త‌ర‌ఫున పోరాడుతున్న కేర‌ళ‌లోని త్రిసూర్‌ వాసి బినిల్(32) మృతి చెందారు. మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. కొన్ని రోజుల క్రితం వీరు డ్రోన్ దాడిలో గాయ‌ప‌డిన‌ట్టు ఫ్యామిలీకి స‌మాచారం వ‌చ్చింది. బినిల్ భార్య మాస్కోలోని భార‌త ఎంబ‌సీని సంప్ర‌దించ‌గా ఆయన మృతిని వారు మౌఖికంగా అంగీక‌రించారు. తిరిగి ఇంటికి చేరుకొనేందుకు బాధితులిద్ద‌రూ గతంలో విఫ‌ల‌ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు తెలుస్తోంది.

News January 13, 2025

బ్రాహ్మణులు నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. ఎక్కడంటే?

image

యువ బ్రాహ్మణ దంపతులకు MP ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరశురామ్ కళ్యాణ్ బోర్డు ఆఫర్ ప్రకటించింది. నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ఆ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా వెల్లడించారు. ‘మనం కుటుంబాలపై దృష్టి పెట్టట్లేదు. యువత ఒక బిడ్డతోనే ఆగిపోతోంది. ఇది ఇబ్బందికరంగా మారుతోంది. భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. అందుకే కనీసం నలుగురు పిల్లల్ని కనాలి’ అని పేర్కొన్నారు.