News April 6, 2024
రేవంత్కు గ్యారంటీల అమలుపై శ్రద్ధ లేదు: కిషన్ రెడ్డి
TG: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో BJP డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. కాషాయపార్టీ దూకుడును ఎవ్వరూ ఆపలేరన్నారు. గ్యారంటీలు ఎక్కడ అమలు చేశారని.. రాహుల్ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్కు ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ గ్యారంటీల అమలుపై లేదని దుయ్యబట్టారు.
Similar News
News January 25, 2025
నేటి ముఖ్యాంశాలు
* AP: రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి
* మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: నారాయణ
* దావోస్లో ఏపీ బ్రాండ్ సర్వనాశనం: రోజా
* TG: 20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
* గోదావరి నీళ్లను పెన్నాకు తరలించే ప్రయత్నం: హరీశ్ రావు
* పెట్టుబడులపై చర్చకు వస్తారా?: టీపీసీసీ చీఫ్ సవాల్
* TG ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను వేధిస్తోంది: కిషన్ రెడ్డి
News January 25, 2025
PHOTOS: ‘మహాకుంభ్’లో డ్రోన్ షో
యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభ మేళా సందర్భంగా డ్రోన్ షో నిర్వహించారు. 2,500 ‘మేడ్ ఇన్ ఇండియా’ డ్రోన్లను ఉపయోగించి భారతీయ పౌరాణిక చరిత్ర, సంప్రదాయాలను ప్రదర్శించారు. డ్రోన్లతో తీర్చిదిద్దిన శివుడు, శంఖం వంటి రూపాలు ఆకట్టుకున్నాయి.
News January 25, 2025
బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దు: హైకోర్టు
TG: రాష్ట్రంలో సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉ.8.40 గంటల మధ్య ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని తెలిపింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్పై విచారించింది. రేట్ల పెంపు అనుమతులను రద్దు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.