News March 16, 2024

సీఎం జగన్‌పై రేవంత్ రెడ్డి పరోక్ష విమర్శలు

image

AP: దివంగత వైఎస్సార్ సంకల్పం నిలబెట్టినవాళ్లే ఆయన వారసులు అవుతారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వైఎస్ ఆశయాలు మర్చిపోయినవారు ఆయన వారసులు ఎలా అవుతారంటూ సీఎం జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు వైఎస్ బిడ్డ షర్మిల నడుంబిగించారని కొనియాడారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకే పోతారని మండిపడ్డారు.

Similar News

News September 18, 2025

భారత్ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రం.. ట్రంప్ తీవ్ర ఆరోపణ

image

భారత్, చైనా, పాక్ సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ దేశాలు డ్రగ్స్, వాటి తయారీకి కావాల్సిన రసాయనాలను ఉత్పత్తి, రవాణా చేస్తూ US ప్రజల భద్రతకు ప్రమాదంగా మారాయని విమర్శించారు. అఫ్గాన్, మెక్సికో, హైతీ, కొలంబియా, పెరూ, పనామా, బొలీవియా, బర్మా వంటి దేశాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. US కాంగ్రెస్‌కు సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్‌లో ఈ ఆరోపణలు చేశారు.

News September 18, 2025

నేడు రాహుల్ గాంధీ ‘స్పెషల్’ ప్రెస్ మీట్

image

ఇవాళ రాహుల్ గాంధీ ఓ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో ఉ.10 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడతారని తెలిపింది. అయితే ఏ అంశాలపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. కొత్తగా రెండు రాష్ట్రాల్లోని రెండు నియోజకవర్గాలు, హై ప్రొఫైల్ లోక్‌సభ స్థానంపై ఓట్ చోరీ ఆరోపణలు చేస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

News September 18, 2025

2030 నాటికి 1.14 లక్షల మందికి ఉపాధి: భట్టి

image

TG: గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడితో 20 వేల మెగావాట్ల రీ యూజబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘2030 నాటికి ఈ పాలసీతో 1.14 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. మహిళా సంఘాల ద్వారా 2 వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం’ అని తెలిపారు.