News March 16, 2024
సీఎం జగన్పై రేవంత్ రెడ్డి పరోక్ష విమర్శలు

AP: దివంగత వైఎస్సార్ సంకల్పం నిలబెట్టినవాళ్లే ఆయన వారసులు అవుతారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. వైఎస్ ఆశయాలు మర్చిపోయినవారు ఆయన వారసులు ఎలా అవుతారంటూ సీఎం జగన్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు వైఎస్ బిడ్డ షర్మిల నడుంబిగించారని కొనియాడారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకే పోతారని మండిపడ్డారు.
Similar News
News April 24, 2025
IPL: నేడు RCBvsRR.. గెలిచేదెవరో?

ఇవాళ RCB, RR మధ్య బెంగళూరు వేదికగా రా.7.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచులు ఆడగా RCB 16, రాజస్థాన్ 14 గెలిచాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు (10pts) నాలుగు, RR ఎనిమిదో (4pts) స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు RCB తన సొంత గ్రౌండ్లో గెలవలేదు. అటు RR గెలవాల్సిన మ్యాచుల్లో చేజేతులా ఓడుతోంది. ఆ జట్టు కెప్టెన్ శాంసన్ నేటి మ్యాచుకూ దూరం కానున్నట్లు సమాచారం.
News April 24, 2025
హిమాచల్ ప్రదేశ్లో హైఅలర్ట్

పహల్గామ్ ఉగ్రదాడి తరహాలో మరోసారి తీవ్రవాదులు హిమాచల్ప్రదేశ్లో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీస్ శాఖను ఆదేశించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్తో బార్డర్ను పంచుకునే చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.
News April 24, 2025
ఓటముల్లో SRH సెంచరీ

SRH ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. IPL హిస్టరీలో 100 ఓటములను ఎదుర్కొన్న ఏడో టీమ్గా నిలిచింది. తొలి ఆరు స్థానాల్లో ఢిల్లీ(137), పంజాబ్(137), ఆర్సీబీ(132), KKR(125), ముంబై(121), రాజస్థాన్(113), CSK(105) ఉన్నాయి. SRHకు ముందు 2008-12 మధ్య హైదరాబాద్ వేదికగా ఉన్న డెక్కన్ ఛార్జర్స్ 75 మ్యాచ్లలో 46సార్లు ఓడిపోయింది.