News February 6, 2025

సర్వే పేరుతో బీసీలను రేవంత్ పొడిచి పొడిచి చంపారు: లక్ష్మణ్

image

TG: సమగ్ర సర్వే పేరుతో గతంలో KCR ఒక్కరోజులో బీసీల గొంతు కోస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కులగణన పేరిట 50 రోజులపాటు పొడిచి పొడిచి చంపారని BJP MP కె.లక్ష్మణ్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకని విమర్శించారు. బీసీలపై రేవంత్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకే సర్వేలో వారి శాతాన్ని తక్కువచేసి చూపించారని లక్ష్మణ్ ఆరోపించారు.

Similar News

News October 16, 2025

నవంబర్‌లో లండన్ పర్యటనకు CM చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్‌లో పర్యటించనున్నారు. విశాఖలో వచ్చేనెల 14, 15న జరగనున్న సీఐఐ సదస్సుకు రావాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగనుంది.

News October 16, 2025

PIC OF THE DAY

image

ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటో వైరలవుతోంది. PIC OF THE DAY అని పలువురు పోస్టులు పెడుతున్నారు. కాగా ‘నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించా. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.

News October 16, 2025

PHOTO GALLERY: శ్రీశైలంలో PM మోదీ

image

AP: ప్రధాని మోదీ శ్రీశైల మల్లన్న సేవలో తరించారు. సంప్రదాయ దుస్తులు ధరించి భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. శ్రీశైల ఆలయంలో మోదీ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.