News December 1, 2024
రేవంత్.. రూ.4వేల పెన్షన్ ఎప్పుడిస్తావ్?: కిషన్రెడ్డి

TG: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2వేల పెన్షన్ను రూ.4వేలు చేస్తామని హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇవ్వాల్సిన రూ.2వేల పెన్షన్ కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. రూ.4వేల పెన్షన్, ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఎప్పుడిస్తావని CM రేవంత్ను ప్రశ్నించారు. హామీలు నెరవేర్చే స్థితిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లేదని ఆయన HYDలో అన్నారు.
Similar News
News February 12, 2026
ఢిల్లీ బాంబు పేలుడుకు జైషేతో లింకులు: UN

ఢిల్లీ <<18265346>>బాంబు బ్లాస్ట్<<>>కు పాక్కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్(JeM)తో సంబంధం ఉందని UN ఉగ్రవాద నిరోధక పర్యవేక్షణ బృందం పేర్కొంది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఈ సంస్థ ప్రత్యేకంగా మహిళా వింగ్ను ఏర్పాటు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. JeMతో ప్రమాదమని పలు దేశాలు చెబుతుంటే ఓ సభ్య దేశం మాత్రం ఆ సంస్థ పని చేయడంలేదని అంటోందని విమర్శించింది. UNSCకి సమర్పించిన నివేదికలో <<16299135>>పహల్గామ్<<>> దాడినీ ప్రస్తావించింది.
News February 12, 2026
మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని విస్మరించకూడదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు షుగర్ హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారడం, దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలుంటాయి. వీటిని గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News February 12, 2026
విద్యార్థులు ఏమనుకుంటారు.. YCP ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆవేదన

AP: నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు సభలో వ్యవహరించిన <<19108172>>తీరుపై<<>> స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీకి వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చారు. సభలో జరిగిన ఆ విధానాన్ని చూసి వారు ఏమనుకుంటారు. ఇంటికెళ్లిన తర్వాత వారు తోటి విద్యార్థులతో ఏం చెబుతారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో కాగితాలు చించి విసిరేశారు. అది సరైన పద్ధతేనా’ అని విచారం వ్యక్తం చేశారు.


