News November 2, 2024
జూన్ కల్లా రేవంత్ను దింపేస్తారు: మహేశ్వర్ రెడ్డి

TG: వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ స్థానంలో ఉత్తమ్ లేదా భట్టివిక్రమార్కకు సీఎం పదవి దక్కొచ్చన్నారు. ఆ పార్టీలోని ఓ వర్గం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందని చెప్పారు. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ అడ్లూరి ఖండించారు.
Similar News
News January 7, 2026
పోర్టు వరకు పోలవరం నావిగేషన్ కెనాల్: CBN

AP: ఉత్పత్తుల జలరవాణా కోసం పోలవరం నుంచి విశాఖ పోర్టువరకు నావిగేషన్ కెనాల్ నిర్మిస్తున్నట్లు CM CBN తెలిపారు. దీనిద్వారా MH, TG తదితర ప్రాంతాల ఉత్పత్తులను భద్రాచలం మీదుగా జలమార్గంలో తరలించవచ్చని చెప్పారు. పోర్టు ద్వారా వీటిని విదేశాలకు ఎగుమతి చేయడం సులభమవుతుందని వివరించారు. ముందు చూపుతో ఈ కెనాల్ను ప్రాజెక్టు ప్రణాళికలో పెట్టించినట్లు వివరించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు సాగు నీరందిస్తామన్నారు.
News January 7, 2026
టెన్త్ విద్యార్థులకు స్నాక్స్.. నిధులు విడుదల

TG: పదో తరగతి విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4.23కోట్ల నిధులను విడుదల చేసింది. వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని డీఈవోలను ఆదేశించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు వీటిని అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి.
News January 7, 2026
మౌలానా వర్సిటీ భూములు వెనక్కి తీసుకుంటే ఉద్యమమే: సంజయ్

TG: HYDలోని మౌలానా ఉర్దూ వర్సిటీకి చెందిన 50 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘వీటిని అమ్మి దోచుకోవాలని చూస్తున్నారు. సల్కం చెరువును ఆక్రమించి విద్యా వ్యాపారం చేస్తున్న ఒవైసీపై చర్యలేవి? వాటిని ఎందుకు తీసుకోవడం లేదు?’ అని ప్రశ్నించారు. GOVT తీరుపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా వర్సిటీలో వినియోగించని 50 ఎకరాల స్వాధీనానికి గతనెల కలెక్టర్ నోటీసులిచ్చారు.


