News December 6, 2024
REVATHI: భర్త, కుమారుడిని కాపాడిన మాతృమూర్తి..!

‘పుష్ప 2’ ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లి మృత్యువాత పడిన రేవతి వెనుక విషాద గాథ దాగి ఉంది. గతేడాది తన భర్త భాస్కర్ అనారోగ్యం పాలైతే ఆమె తన లివర్ను కొంత భాగం దానం చేసి ఆయనను బతికించుకున్నారు. అలాగే నిన్న తొక్కిసలాటలో కూడా కుమారుడిని తన పొత్తిళ్లలో ఉంచుకుని రక్షించుకున్నారు. కానీ ఆమె చివరకు తన ప్రాణాలే కోల్పోయారు. ఈ విషయాలన్నీ చెబుతూ ఆమె భర్త కన్నీరుమున్నీరు అయ్యారు.
Similar News
News February 11, 2026
NRPT: ముగిసిన పోలింగ్.. శుక్రవారమే ఫలితాలు

నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డులకు బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 34,460 ఓట్లకు గాను 22,938 ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు, మున్సిపల్ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. తుది ఫలితాలు ఫిబ్రవరి 13న (శుక్రవారం) వెలువడనున్నాయి.
News February 11, 2026
చికెన్లో ఈ భాగాలు తినకండి

కోళ్ల లంగ్స్లోని పరాన్నజీవులు ఎక్కువ వేడిని తట్టుకోగలవు. మనం బాగా ఉడికించినా కొన్ని నశించకపోవచ్చు. పెస్టిసైడ్స్ తింటే కోడి తలలో చిన్న కణితులు ఏర్పడతాయి. కాబట్టి తల జోలికి వెళ్లకపోవడం బెటర్. కాళ్ల వేళ్లు, ప్రేగులు, జీర్ణాశయంలో బాక్టీరియా పేరుకుంటుంది. సాధారణంగా శుభ్రం చేస్తే అవి పోవు. స్కిన్ పూర్తిగా కొలెస్ట్రాల్ కావడంతో ఊబకాయులు, హార్ట్ సమస్యలు ఉన్నవారు తినకండి.
News February 11, 2026
జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆగ్రహం

TG: సంగారెడ్డిలో జగ్గారెడ్డి <<19110877>>వ్యవహారంపై<<>> రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన కామెంట్స్ ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. ఆయనపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. కాగా సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారంటూ పోలీసులపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ఆపుతానంటూ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.


