News September 8, 2024

నా అనర్హతపై ఆనందించడం దేశద్రోహమే: వినేశ్

image

ఒలింపిక్స్‌లో తన అనర్హత వేటుపై ఆనందిస్తున్నవారిని దేశద్రోహులుగా పరిగణించి విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత, రెజ్లర్ వినేశ్ ఫొగట్ డిమాండ్ చేశారు. ‘నేను గెలవలేదని హ్యాపీ అవుతున్నారంటే అది దేశద్రోహమే. వారు దేశాన్ని, జాతిని అగౌరవపరిచినట్లే’ అని పేర్కొన్నారు. దేవుడు శిక్షించడం వల్లే వినేశ్ ఒలింపిక్స్‌లో ఓడారంటూ WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Similar News

News November 17, 2025

మృతులంతా హైదరాబాదీలే: TG హజ్ కమిటీ

image

సౌదీ <<18308554>>బస్సు ప్రమాద<<>> మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారేనని తెలంగాణ హజ్ కమిటీ స్పష్టం చేసింది. ‘4 ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మొత్తం 45మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 17మంది పురుషులు, 28మంది మహిళలున్నారు. చనిపోయినవారు మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందినవారు’ అని వెల్లడించింది.

News November 17, 2025

ఈ మహిళలు ఏడాదికో కొత్త భాగస్వామిని ఎంచుకోవచ్చు!

image

రాజస్థాన్‌లోని గరాసియా తెగలో వింత ఆచారం ఉంది. ఇక్కడి మహిళలు జాతరలో తమకు నచ్చిన కొత్త భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంది. సహజీవనం చేశాక గర్భం దాల్చితే పెళ్లి చేసుకోవాలి. నచ్చకపోతే మహిళ విడిపోయి మళ్లీ కొత్త వ్యక్తిని వెతుక్కునే స్వేచ్ఛ ఉంది. ఈ సహజీవనం కోసం అబ్బాయి అమ్మాయికి డబ్బు చెల్లించాలి. ఒకవేళ మహిళ మరొకరితో జీవించాలనుకుంటే ఎంచుకున్న కొత్త వ్యక్తి మాజీ భాగస్వామికి అధిక మొత్తంలో డబ్బు చెల్లించాలి.

News November 17, 2025

బొప్పాయిలో రసం పీల్చే పురుగులను ఎలా నివారించాలి?

image

బొప్పాయి మొక్కలు నాటడానికి 15 రోజుల ముందే తోట చుట్టూ 2 వరుసల్లో అవిశ, 2 వరుసల్లో మొక్కజొన్న మొక్కలను నాటాలి. అలాగే పొలంలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తెలుసుకోవడానికి ఎకరాకు 12-15 పసుపు రంగు జిగురు అట్టలను మొక్కల కన్నా ఎత్తులో పెట్టాలి. ఒకవేళ రసం పీల్చే పురుగులను గమనిస్తే లీటరు నీటికి వేపనూనె 2.5ml+ అసిఫేట్ 1.5 గ్రా+ జిగురు 0.5ml కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉద్ధృతిని బట్టి పిచికారీ చేయాలి.