News August 28, 2024
రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసిన ప్రభుత్వం

AP: రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర <<13958383>>మంత్రివర్గం<<>> నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను కొనసాగించేందుకు అంగీకరించింది. పట్టాదారు పాస్బుక్లపై జగన్ బొమ్మ తొలగింపు, వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు ఆమోదం తెలిపింది.
Similar News
News October 26, 2025
ప్రెగ్నెన్సీలో పానీపూరి తింటున్నారా?

పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రెగ్నెన్సీలో సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే చాలామంది క్రేవింగ్స్ పేరుతో ఫాస్ట్ఫుడ్స్, స్వీట్స్ వంటివి అతిగా తీసుకుంటారు. ముఖ్యంగా పానీపూరి, ఫాస్ట్ఫుడ్, బిర్యానీ వంటివి అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు. వీటిని తింటే విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ సమస్యలొస్తాయంటున్నారు. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినాలని సూచిస్తున్నారు.
News October 26, 2025
విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. తప్పిన ప్రమాదం

సౌదీ అరేబియాకు చెందిన SV340(Boeing 777-300) విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. జెడ్డా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పక్షుల గుంపు ఢీకొట్టింది. అక్కడ పక్షుల రక్తపు మరకలు అంటుకున్నాయి. ముందరి భాగం దెబ్బతింది. ల్యాండింగ్ సేఫ్టీనే అని పైలట్ నిర్ధారించుకుని ల్యాండ్ చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు గుర్తించారు. పక్షులు ఇంజిన్లోకి వెళ్లి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది.
News October 26, 2025
‘కాలానమక్’ వరి రకం ప్రత్యేకతలు ఇవే..

కాలానమక్ దేశీ వరి రకం పంట కాలం 130 నుంచి 140 రోజులు. 3 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ బియ్యంలో ఉండే అధిక ప్రొటీన్లు, ఐరన్, జింక్, ఇతర సూక్ష్మపోషకాలు మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ బియ్యానికి 2013లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. ఔషద గుణాలు కలిగిన ఈ బియ్యం తినడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచవచ్చంటున్నారు నిపుణులు.


