News December 1, 2024
మూడేళ్లలో రూ.45వేల కోట్ల విలువైన బియ్యం ఎగుమతి: నాదెండ్ల

AP: వైసీపీ హయాంలో కాకినాడ పోర్టులోకి రాష్ట్ర అధికారులు ఎవరూ వెళ్లకుండా కుట్ర చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ‘మూడేళ్లలోనే రూ.45వేల కోట్ల విలువైన కోటీ 31 లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారు. ఇంత భారీ దోపిడీ జరిగింది కాబట్టే మేం పోర్టుపై ప్రత్యేక దృష్టిసారించాం. రేషన్ డోర్ డెలివరీ పేరుతో 9వేలకు పైగా వ్యాన్లు కొని, వాటి ద్వారానే బియ్యాన్ని పోర్టుకు తరలించారు’ అని ఆరోపించారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


