News July 9, 2024
గ్రాట్యుటీ పొందడం ఉద్యోగి హక్కు: హైకోర్టు

TG: రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ పొందడం ఉద్యోగి హక్కు అని హైకోర్టు స్పష్టం చేసింది. అది యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని పేర్కొంది. ఉద్యోగి లేదా వారసులకు గ్రాట్యుటీ ఇవ్వాలని చట్టంలో ఉందని తేల్చి చెప్పింది. రూ.3.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెరిగిన గ్రాట్యుటీ సీలింగ్కు ఉద్యోగులు అర్హులంటూ PF అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ECIL దాఖలు చేసిన అప్పీళ్లపై కోర్టు ఇలా స్పందించింది.
Similar News
News February 3, 2026
జల్జీవన్ మిషన్ నిధులు నిలిపివేత

జల్జీవన్ మిషన్లో మిగిలిన పనులకు నిధులు నిలిపివేస్తున్నట్లు కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. 2019లో చేపట్టిన ఈ స్కీమ్లో ₹2.08 లక్షల CR 2024-25కే ఖర్చయి 81.5% పనులే పూర్తయ్యాయి. పలు రాష్ట్రాల్లో అక్రమాలు గుర్తించిన కేంద్రం మిగతా పనులకు నిధులు రాష్ట్రాలే భరించాలని స్పష్టం చేసింది. FY26-27కు కేటాయించిన ₹67,670 CR నిర్వహణకు ఇవ్వనుంది. కాగా APలో రూ.23వేల కోట్ల పనులకు ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపింది.
News February 3, 2026
13న ఓటీటీలోకి రవితేజ సినిమా?

రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సమాచారం. ఈ నెల 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ట్రయాంగిల్ లవ్&కామెడీ డ్రామాతో రూపొందిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.
News February 3, 2026
U19 WC.. ఫైనల్లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్ సెమీస్లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత ENG 277/7 స్కోర్ చేయగా ఆసీస్ 47.3 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌటైంది. రేపు రెండో సెమీస్లో ఇండియా, అఫ్గాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో ఇంగ్లండ్తో తలపడుతుంది.


