News September 11, 2025

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో రిషబ్ శెట్టి?

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఓ స్పెషల్ రోల్‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయన పాత్ర ఉంటుందని టాక్. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో టొవినో థామస్, అనిల్ కపూర్ వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Similar News

News September 11, 2025

పాక్‌తో మ్యాచ్.. ఆసక్తి చూపని IND ఫ్యాన్స్?

image

INDvsPAK మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. మ్యాచ్ ఎక్కడ జరిగినా క్షణాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. అయితే UAEలో జరుగుతోన్న ఆసియా కప్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈనెల 14న జరిగే దాయాదుల మ్యాచ్‌పై భారతీయులు ఆసక్తి చూపించట్లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మ్యాచుకు మరో 2 రోజులే ఉన్నా టికెట్స్ ఇంకా సేల్ అవలేదట. పహల్గామ్ అటాక్ కారణంగా PAKతో మ్యాచ్‌పై భారతీయులు ఆసక్తిగా లేరని అంటున్నాయి.

News September 11, 2025

OTT డీల్స్‌తో బడ్జెట్ రికవరీ!

image

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈక్రమంలో ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తానికి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ దక్కించుకుంది. ఏకంగా రూ.125కోట్లకు అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు పొందినట్లు టాక్. అలాగే నందమూరి బాలకృష్ణ ‘అఖండ-2’ క్రేజ్‌ను వాడుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ₹80కోట్లకు స్ట్రీమింగ్ హక్కులు కొన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో బడ్జెట్‌లో 80% వచ్చేసిందట.

News September 11, 2025

పవన్ బాపట్ల పర్యటన రద్దు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దయింది. జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పవన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో చివరి నిమిషంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.