News December 3, 2024
ఛత్రపతి శివాజీగా రిషబ్.. పోస్టర్ విడుదల

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్.. ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. సందీప్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం శివాజీ జీవితంపై తెరకెక్కనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ సినిమా 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, రిషబ్ ప్రస్తుతం ‘కాంతార-2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
Similar News
News December 18, 2025
మొబైల్ రీఛార్జ్లపై 20% పెంపు?

రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేందుకు Jio, Airtel, VI సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2026 నాటికి ఈ కంపెనీలు తమ ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ టారిఫ్లను 16-20% వరకు పెంచే అవకాశం ఉందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ‘మోర్గాన్ స్టాన్లీ’ పేర్కొంది. గతంలో 2024 జులైలో ధరలు పెరగగా రెండేళ్ల విరామం తర్వాత 2026లో మరోసారి సామాన్యుల జేబుకు చిల్లు పడనుందని తెలిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
News December 18, 2025
నాకు ఇష్టమైన పదం.. టారిఫ్స్: ట్రంప్

రికార్డు స్థాయిలో $18 ట్రిలియన్ల పెట్టుబడులను అమెరికాకు తీసుకొచ్చానని ట్రంప్ అన్నారు. ఈ విజయంలో ఎక్కువ భాగం సుంకాల వల్లే సాధ్యమైందని చెప్పారు. ‘టారిఫ్స్ నాకు ఇష్టమైన పదం. ఇతర దేశాలు కొన్ని దశాబ్దాల పాటు టారిఫ్స్ను మనకు వ్యతిరేకంగా ఉపయోగించాయి. కానీ ఇప్పుడు అలా జరగబోదు’ అని చెప్పారు. అమెరికాలో తయారు చేస్తే టారిఫ్స్ ఉండవని కంపెనీలకు తెలుసని, అందుకే రికార్డు సంఖ్యలో ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు.
News December 18, 2025
కలబందతో చర్మానికి ఎన్నో లాభాలు

జిడ్డు చర్మం ఉన్నవారు తరచూ ముఖానికి కలబంద రాయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి గ్లో వస్తుంది. సున్నిత చర్మం ఉన్నవారికి సన్ బర్న్, హీట్ రాషెస్ వంటి సమస్యలకు కలబంద బాగా పని చేస్తుంది. కలబంద, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం సున్నితంగా మారడంతో పాటు, ముడతలను తగ్గిస్తుంది. చర్మం తక్షణ మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకోవాలి.


