News November 1, 2024
రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రకు జీవం పోశారు: ప్రశాంత్

దీపావళి సందర్భంగా రిలీజైన ‘జై హనుమాన్’ పోస్టర్కు భారీ రెస్పాన్స్ వచ్చిందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. జాతీయ అవార్డు గ్రహీత నటుడు రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రకు జీవం పోశారంటూ ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన పరివర్తన, ఖచ్చితమైన పరిపూర్ణత, మీ నిబద్ధత జై హనుమాన్ని అసాధారణమైనదిగా మార్చాయి. మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, ఇంకా జై హనుమాన్ ప్రయాణాన్ని మీతో ప్రారంభించేందుకు ఎగ్జైట్గా ఉన్నా’ అని తెలిపారు.
Similar News
News November 1, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న

భారత ప్లేయర్ రోహన్ బోపన్న(45) ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలికారు. ‘నా రాకెట్ను అధికారికంగా వదిలేస్తున్నా. భారత్కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తా’ అని తెలిపారు. ఇటీవల ప్యారిస్ మాస్టర్స్1000 ఈవెంట్లో బోపన్న తన చివరి మ్యాచ్(డబుల్స్) ఆడారు. 22ఏళ్ల కెరీర్లో 2 గ్రాండ్స్లామ్ టైటిల్స్తోపాటు ఓల్డెస్ట్ గ్రాండ్స్లామ్ విన్నర్గా, డబుల్స్లో ఓల్డెస్ట్ వరల్డ్ no.1గా చరిత్ర సృష్టించారు.
News November 1, 2025
ఈ ఏడాది జరిగిన తొక్కిసలాటలు ఇవే..

– JAN8: తిరుపతి- వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూ లైన్లో ఆరుగురి మృతి
– JAN29: UP కుంభమేళా- మౌని అమావాస్య స్నానాల్లో 30 మంది మృతి
– FEB 15: ఢిల్లీ రైల్వే స్టేషన్- రైల్వే అనౌన్స్మెంట్ గందరగోళంతో ప్లాట్ఫాం 14, 15పై 18 మంది మృతి
– JUNE4: బెంగళూరు- RCB విక్టరీ పరేడ్లో 11 మంది మృతి
– SEP27: కరూర్లో TVK చీఫ్ విజయ్ ర్యాలీలో 41 మంది మృతి
– NOV1: శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో 10 మంది మృతి
News November 1, 2025
ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలి: BJP MP

దేశ రాజధాని ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలన్న డిమాండ్లు క్రమేణా పెరుగుతున్నాయి. ఢిల్లీ BJP MP ప్రవీణ్ ఖండేల్వాల్ హోమ్ మంత్రి అమిత్ షాకు, ఢిల్లీ CM, మంత్రులకు లేఖ రాశారు. ఇంద్రప్రస్థగా పేరుమార్చి దేశ చారిత్రక, సాంస్కృతిక, నాగరికత మూలాలను ప్రతిబింబింప చేయాలని పేర్కొన్నారు. కాగా ఇంతకు ముందు VHP కూడా ఢిల్లీ పేరు మార్పుపై కేంద్రానికి లేఖ రాసింది. ఎంపీ లేఖతో ఈ డిమాండ్కు మరింత మద్దతు వస్తోంది.


